రాష్ట్రపతి ఎవరో తేలేది నేడే: సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు..
తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు.
న్యూఢిల్లీ: భారత అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతికి ఎవరు ఎన్నికవుతారన్నది నేడే తేలిపోనుంది. ప్రణబ్ వారసుడిగా రాష్ట్రపతి పీఠాన్ని కైవసం చేసుకోబోయెదెవరు? అన్న దానిపై ఈ సాయంత్రానికల్లా తేలిపోనుంది.
ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. తదనంతరం అల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం.. మిగతా రాష్ట్రాల పెట్టెలను తెరిచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మొత్తం 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, సాయంత్రానికల్లా పూర్తి ఫలితం వస్తుందని అన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ దఫా ఇద్దరు దళిత అభ్యర్థులే బరిలో దిగడం తెలిసిన విషయమే. ఎన్డీఏ పక్షాల తరపున రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ బరిలో నిలిచారు.
రాష్ట్రపతిని ఎన్నికల్లో మొత్తం 4896 మందికి ఓటుహక్కు ఉండగా సోమవారం జరిగిన పోలింగ్లో 99 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గెలిచిన అభ్యర్థి 14వ రాష్ట్రపతిగా ఈనెల 25 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications