Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికే ఇదే కారణం!

లండన్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు యూకేకు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు.

ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. 1945 ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి తైవాన్‌ రాజధాని తైపీ శివార్లలో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నేతాజీతో పాటు, అతని సన్నిహితుడు కల్నల్‌ హబిబర్‌ రెహ్మాన్‌ఖాన్‌ కూడా ఉన్నారు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఓ జపాన్‌ డాక్టర్‌ నేతాజీకి చికిత్స అందించారు. అనంతరం నేతాజీ కోమాలోకి వెళ్లిపోయారు. కాగా, కొద్ది సేపటికే ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడే పనిచేసిన నర్సు కూడా ధృవీకరించింది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేతాజీ ఓ ఇంగ్లీషు అనువాదకుడిని కోరినట్లు వారు చెబుతున్నారు.

Subhas Chandra Bose died of injuries sustained in plane crash: UK website

ఆ సమయంలో.. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలానని, తన మరణవార్త భారత్‌కు తెలియజేయాలని నేతాజీ కోరుకున్నారు. ఈ విషయాన్ని నేతాజీ సన్నిహితుడు రెహ్మాన్‌ఖాన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఎప్పటికీ సేవలందించాలని ఆయన కాంక్షించినట్లు రెహ్మాన్‌ ఖాన్‌ తెలిపారు. కాగా, నేతాజీ మరణం తర్వాత జపాన్ అధికారులు, ఇతర సిబ్బంది ఆయన మృతదేహం వద్ద వరుసగా నిల్చుని సెల్యూట్ చేసి నివాళులర్పించారు. ఈ వివరాల ఆధారంగా నేతాజీ ఆ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు స్పష్టమవుతోందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+