ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్.. రూ.599కే ఫోన్
ఫ్లిప్కార్ట్లో బిగ్ దసరా సేల్ ప్రారంభమైంది. ఇందులో స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి బడ్జెట్ లో విడుదల చేస్తున్న ఫోన్లు, వాటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. బడ్జెట్ ఫోన్లపై 40 నుంచి 50 శాతం రాయితీ లభిస్తోంది.
poco C50 స్మార్ట్ ఫోన్ అత్యంత చౌకగా లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను MRP ధర రూ.8,999కు విక్రయించింది. తర్వాత పండగ సేల్లో భాగంగా 38 శాతం తగ్గింపుతో రూ. 5,499కే పొందొచ్చు. ఇంతకన్నా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్లు కూడా వినియోగించుకోవచ్చు.

బిగ్ దసరా సేల్లో భాగంగా poco C50 స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్లు చెల్లిస్తే ఐదు శాతం తగ్గింపు ఉంది. తద్వారా రూ. 5,224 పొందవచ్చు. మరిన్ని బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను సందర్శిస్తే చాలు. ఫ్లిప్కార్ట్ poco C50 స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.
ఈ ఆఫర్ ను వినియోగించి ఫోన్ ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే రూ. 4,900 తగ్గింపు ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ని బట్టి ఎక్స్ఛేంజ్ ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని రాయితీలు పోను రూ. 599కే పొందవచ్చు












Click it and Unblock the Notifications