"ఆపరేషన్ సింధూర్"కు రివెంజ్ ప్లాన్ చేసిన ఐఎస్‌ఐ ? పంజాబ్‌ పేలుడు వెనుక పాక్ ??

పంజాబ్‌లోని జలంధర్‌ బీఎస్‌ఎఫ్‌ చౌక్ దగ్గర మంగళవారం రాత్రి జరిగిన స్కూటర్ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ప్రమాదంగా భావించినా, లోతైన విచారణలో ఆశ్చర్యకర నిజాలు వెల్లడయ్యాయి. ఉన్నత నిఘా వర్గాల ప్రకారం, ఇది గ్రెనేడ్ దాడి అని అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. నిఘా ఏజెన్సీలు దీనిని పక్కా ఉగ్రదాడిగా పరిగణిస్తున్నాయి.

ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఆధారిత హ్యాండ్లర్ల హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సరిహద్దు అవతలి నుండి పనిచేసే ఆపరేటివ్‌లు.. స్థానిక నేర నెట్‌వర్క్‌లు, గ్యాంగ్‌స్టర్లను వాడుకుంటున్నారని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పంజాబ్‌లో భద్రతా దళాలు, రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో అస్థిరత సృష్టించడమే వారి ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించాయి.

punjab-police-probe-pakistan-links-in-jalandhar-scooter-blast-as-terror-alert-issued-across-the-stat

కాగా రద్దీగా ఉండే బీఎస్‌ఎఫ్ చౌక్ వద్ద యాక్టివా స్కూటర్ భారీ శబ్దంతో పేలి, మంటలు చెలరేగాయి. స్థానికులు భయపడగా, పోలీసులు, అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. పేలుడు సమయంలో స్కూటర్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

పాకిస్థాన్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) వంటి ఉగ్రసంస్థల పాత్రపై దర్యాప్తు కేంద్రీకృతమైంది. ఈ సంస్థలు స్థానిక గ్యాంగ్‌స్టర్లకు డబ్బు, ఆయుధాలు ఆశ చూపి గ్రెనేడ్ దాడులు చేయిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. తీవ్రవాదులు, నేరస్థుల మధ్య ఉన్న ఈ బంధాన్ని ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

మరోవైపు పంజాబ్‌లో గ్రెనేడ్ దాడుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. 2024 ప్రారంభం నుండి రాష్ట్రంలో 20కి పైగా దాడులు నమోదయ్యాయి. ఎక్కువగా జలంధర్, అమృత్‌సర్ వంటి సరిహద్దు జిల్లాల్లోని ప్రధాన నగరాల్లోనే జరిగాయి. పోలీస్ స్టేషన్లు, భద్రతా స్థావరాలు, రాజకీయ కార్యాలయాలే ఈ దాడులకు ప్రధాన లక్ష్యాలు. ఇది రాష్ట్ర భద్రతకు సవాలుగా మారింది.

ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు ప్రదేశం నుంచి కీలక ఆధారాలు, పేలుడు పదార్థాల అవశేషాలను సేకరించారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు రహస్యంగా సాగుతోందని, మరిన్ని వివరాలు వెల్లడించలేమని అధికారులు తెలిపారు.

గత దాడులను NIA, రాష్ట్ర పోలీసులు విశ్లేషించగా ఒకే తరహా వ్యూహం బయటపడింది. దాడులకు పాల్పడే స్థానిక కార్యకర్తలు పట్టుబడుతున్నప్పటికీ, వారిని నడిపే సూత్రధారులు (Handlers) పాకిస్థాన్ లేదా యూరప్‌లో తలదాచుకుంటున్నారు. విదేశీ గడ్డపై నుంచి జరుగుతున్న ఈ కుట్రలను అడ్డుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.

జలంధర్ గ్రెనేడ్ దాడి నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేసి, అనుమానిత కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను పట్టుకుంటామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+