కాంగ్రెస్ పై డీఎంకే ప్రతీకారం.. ! లోక్ సభ స్పీకర్ కు లేఖ..!
తమిళనాడులో దశాబ్దాలుగా కలిసి ఉన్న డీఎంకే-కాంగ్రెస్ (Dmk - Congress) తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం విడిపోయాయి. రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో బీజేపీ కానీ, ఆ పార్టీకి మద్దతుగా ఏర్పడే ప్రభుత్వాన్ని కానీ అడ్డుకునేందుకు వీలుగా టీవీకేతో జట్టు కట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ద్రోహిగా, వెన్నుపోటుదారుగా అభివర్ణిస్తోంది. అదే సమయంలో పార్లమెంట్ లోనూ డీఎంకే ప్రతీకార చర్యలకు దిగింది.
ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకేతో కాంగ్రెస్ విడిపోయిన నేపథ్యంలో లోక్ సభలో తమకు ఆ పార్టీ ఎంపీల పక్కన కాకుండా వేరే చోట సీట్లు కేటాయించాలని ఎంపీ కనిమొళి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ తో తమ పొత్తు ముగిసినందున ఈ మేరకు తమకు వారి పక్కన కాకుండా వేరే చోట సీట్లు కేటాయించాలని కోరారు. తద్వారా డీఎంకే ఎంపీలు లోక్ సభలో స్వేచ్ఛగా తమ బాధ్యతలు నెరవేర్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

DMK writes to speaker to change seating arrangement in Lok Sabha so they aren’t seated next to Congress MPs ☠️☠️ pic.twitter.com/K5E87TZ0Z1
— Akshita Nandagopal (@Akshita_N) May 8, 2026
ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్-డీఎంకే మధ్య పరిస్ధితి ఉప్పునిప్పూ అన్నట్లుగా మారింది. కొన్నిచోట్ల ఇరు పార్టీల నేతలు దాడులు కూడ చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసి మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అలాగే కాంగ్రెస్ తో పాటు కూటమి నుంచి వెళ్లాలనుకునే నేతలకూ స్వేచ్ఛ ఉందని కూడా స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్దాయిలో మాత్రం పరిస్ధితులు భిన్నంగానే కనిపిస్తున్నాయి.















Click it and Unblock the Notifications