ఏపీలో మరో ఏఐ డేటా సెంటర్..! గూగుల్ కు పోటీగా దేశీయ దిగ్గజం..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేతకు డిమాండ్ పెరుగుతున్న వేళ ఏఐ డేటా సెంటర్లకు మన దేశంలో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకొచ్చింది. దీంతో దేశంలోనే తొలి ఏఐ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇదే క్రమంలో ఇవాళ ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు దీనికి వేదికైంది.
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇదే క్రమంలో రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకరించింది.

ఇందులో భాగంగా ఏఐ డేటా సెంటర్ తో పాటు , సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయెన్స్ ప్రకటించింది. దీంతో ఏపీపై నమ్మకం ఉంచి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ అంగీకరించింది. ప్రపంచంలో అత్యంత అధునాతనమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రిలయెన్స్ తెలిపింది.

గుజరాత్ లోని జామ్నగర్లో ఉన్న రిలయెన్స్ గిగావాట్-స్థాయి AI డేటా సెంటర్కు అనుబంధంగా ఏపీలో పని చేసేలా ఏఐ-డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. జామ్ నగర్, ఏపీలోని రెండు ఏఐ డేటా సెంటర్లతో ఆసియాలోనే అత్యంత బలమైన AI మౌలిక సదుపాయాల నెట్వర్క్లలో ఒకటిగా ఈ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న AI డేటా సెంటర్ కోసం రిలయన్స్ 6 గిగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించడానికి కూడా రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయని అంచనా.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications