మైక్రోసాఫ్ట్ టెక్కీలకు షాకుల మీద షాకులు- ఆ వింగ్ షట్ డౌన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికా టెక్ దిగ్గజంమైక్రోసాఫ్ట్ మరో వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది 15,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. ఇప్పుడు తీసుకున్న ఈ తాజా చర్యలు టెక్కీలను మరింత ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తోన్నాయి. ఈ ఏడాది కూడా మరిన్ని లేఆఫ్లు ఉండొచ్చంటూ జరుగుతోన్న ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్టయింది.
తాజాగా టెక్కీల కోసం వార్తాపత్రికలు, లైబ్రరీ సబ్స్క్రిప్షన్లను మైక్రోసాఫ్ట్ రద్దు చేసింది. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లైబ్రరీ, న్యూస్ పేపర్ల వైపు మళ్లిస్తున్నట్లు రెడ్మండ్ కేంద్రంగా పనిచేసే ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా ఏఐపై దృష్టి సారిస్తోంది. సంస్థలో అన్ని డివిజన్లల్లో కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ వస్తోంది. దీనిపై గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ పెట్టుబడులను పెడుతోంది.

ఈ మార్పులో భాగంగా గత ఏడాది నవంబర్ లోనే మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అనేక పబ్లిషర్లకు ఆటోమేటెడ్ కాంట్రాక్ట్ రద్దు నోటిఫికేషన్లను పంపింది. న్యూస్ పేపర్లు, రిపోర్ట్ సేవలకు సంబంధించిన సబ్స్క్రిప్షన్లను నిలిపివేయడం ప్రారంభించింది. లైబ్రరీ స్టాఫ్ లో కూడా తాజాగా కోత పెట్టిందని, సబ్స్క్రిప్షన్లను నిలిపివేసిందని ది వెర్జ్ వెల్లడించింది. దీనిపై మైక్రోసాఫ్ట్ వెండర్ మేనేజ్మెంట్ టీమ్.. ఉద్యోగులకు ఓ ఇమెయిల్ కూడా పంపింది.
తన ప్రస్తుత ఒప్పందాల గడువు ముగిసిన తర్వాత వాటిని పునరుద్ధరించబోదని, ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తున్నామనేది ఈ ఇమెయిల్ సారాంశం. ఈ చర్య- అనేకమంది ఉద్యోగులలో ఆందోళనను రేకెత్తించింది. ఇందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ న్యూస్ సర్వీస్ తో మైక్రోసాఫ్ట్ తన సంబంధాన్ని తెంచుకోవడం. ఈ న్యూస్ సర్వీస్.. గత రెండు దశాబ్దాలుగా మైక్రోసాఫ్ట్లోని సుమారు 2,20,000 మంది ఉద్యోగులకు గ్లోబల్ రిపోర్ట్స్ను అందిస్తూ వస్తోంది.
మైక్రోసాఫ్ట్ వెండర్ మేనేజ్మెంట్ టీమ్ మెయిల్ అందిన టెక్కీలకు 'ది ఇన్ఫర్మేషన్' వంటి కొన్ని వ్యాపార ప్రచురణలకు డిజిటల్ యాక్సెస్ అందడం లేదు. అలాగే మైక్రోసాఫ్ట్ లైబ్రరీ నుండి వ్యాపార పుస్తకాలను తీసుకోవడం సాధ్యం కావడం లేదు. మైక్రోసాఫ్ట్ సాధారణంగా తన లైబ్రరీ సేవలను మార్పు చేస్తుంటుంది. ఈ పరిణామం- ఖర్చులను తగ్గించుకోవడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై మైక్రోసాఫ్ట్ ఎంతగా ఆధారపడుతోందనేది స్పష్టం చేసినట్టయింది.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications