Anthropic: భారత్ లో అడుగుపెట్టకముందే ఆంత్రోపిక్ కు భారీ షాక్..!
భారత్ లోనూ అదే పేరున్న సంస్ధ ఉండటంతో అమెరికన్ ఏఐ సంస్ధ ఆంత్రోపిక్ కు ఇక్కడ న్యాయపరమైన సమస్యలు తప్పడం లేదు.
అత్యాధునిక ఏఐ టూల్స్ ను తీసుకొచ్చి ఐటీ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అవసరం లేకుండా ప్లగిన్స్, టూల్స్ రిలీజ్ చేస్తూ అంతర్జాతీయంగా మార్కెట్లను ముంచేసిన అమెరికన్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) కు భారత్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న ఆంత్రోపిక్ కు ఐటీ రాజధాని బెంగళూరులో ఈ షాక్ తగిలింది. దీంతో భారత్ లో ఎంట్రీ విషయంలో ఆంత్రోపిక్ పునరాలోచించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో తమ ఏఐ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆంత్రోపిక్ ప్లాన్ చేసుకుంది. అయితే కర్నాటకలో ఇదే ఆంత్రోపిక్ పేరుతో మరో ఐటీ సంస్థ ఇప్పటికే నడుస్తోంది. అయితే దాని పూర్తిపేరు ఆంత్రోపిక్ సాఫ్ట్ వేర్. దీంతో స్థానికంగా తమ సంస్థ ఉండగా.. ఆంత్రోపిక్ అనే విదేశీ సంస్థకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఈ కర్నాటక సంస్థ అక్కడి కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది.

టెక్క్రంచ్ నివేదిక ప్రకారం, భారతీయ సంస్థ ఆంత్రోపిక్ సాఫ్ట్వేర్... తాము 2017 నుంచి ఈ పేరును ఉపయోగిస్తున్నామని ఇప్పుడు అమెరికా సంస్ధ రాక తమ వినియోగదారులలో గందరగోళం సృష్టించిందని ఆరోపిస్తోంది. ఇదే ఆరోపణలతో కర్నాటకలోని కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది. ఆంత్రోపిక్ పేరు వినియోగానికి గుర్తింపు, గందరగోళ నివారణ, అలాగే కోటిరూపాయల నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఆంత్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయ్యాజ్ ముల్లా ఈ పిటిషన్ వేశారు. అయితే తాము ఆంత్రోపిక్ తో ఘర్షణ కోరుకోవడంలేదని, కేవలం పాత పేరు వినియోగం పట్ల స్పష్టత, గుర్తింపు మాత్రమే కోరుతున్నామని తెలిపారు. చర్చలు విఫలం కావడంతోనే కోర్టును ఆశ్రయించామన్నారు.

జనవరి 20న కర్ణాటక కోర్టు ఆంత్రోపిక్కు నోటీసులు జారీ చేసింది, అయితే మధ్యంతర చర్యలకు మాత్రం నిరాకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న చేయనుంది. దీనిపై ఆంత్రోపిక్ స్పందించలేదని టెక్క్రంచ్ తెలిపింది. మరోవైపు ఆంత్రోపిక్ భారతీయ మార్కెట్పై తన ఫోకస్ పెంచుతోంది. గతేడాది అక్టోబర్లో ఆఫీసును ఓపెన్ చేయడంతో పాటు మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ ఐరినా ఘోస్ను అధిపతిగా నియమించుకుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ వంటి గ్లోబల్ ఏఐ కంపెనీలకు కీలక పోటీ ప్రాంతంగా మారుతోంది.
-
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications