ప్రపంచకప్లో ధావన్ లేకపోవడంతో ఇండియన్ టీంపై ప్రభావం చూపనుందా? మీ కామెంట్ చెప్పండి
ప్రపంచకప్లో వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియాకు షాక్ తగలింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడు వారాల పాటు మ్యాచ్లకు దూరమయ్యారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అద్భుత శతకం సాధించిన ధావన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నారు.
బ్యాటింగ్ సందర్భంగా ఆసీస్ బౌలర్ కౌల్టర్ నీల్ వేసిన ఓవర్లో అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయం కారణంగా వేలి నొప్పితో బాధపడ్డ ధావన్ ఫీల్డింగ్కు చేయకుండా పెవిలియన్కే పరిమితమయ్యాడు. మ్యాచ్ అనంతరం ధావన్ వేలికి స్కానింగ్ చేసిన డాక్టర్లు హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. గాయం నుంచి కోలుకునేందుకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

నిజానికి ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్లకు ధావన్ దూరమవడుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్తో, ఆదివారం పాకిస్థాన్తో, జూన్ 22న అఫ్గానిస్థాన్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ధావన్ ప్రపంచ కప్ మ్యాచ్లకు దూరమవడం ఇండియన్ క్రికెట్ టీంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications