UPSC Jobs: 2025లో NDA/NAలో చేరాలనుకుంటున్నారా? UPSC నోటిఫికేషన్ వచ్చేసింది.!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) (I) పరీక్ష 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ విభాగాలలోకి అధికారులుగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ద్వారా సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఖాళీలు:
మొత్తం 406 ఖాళీలు ఉన్నాయి . వాటిల్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ సైన్యం విభాగంలో 208 (10 మహిళా అభ్యర్థులకు) ఖాళీలు, నావికాదళం: 42 (6 మహిళా అభ్యర్థులకు) ఖాళీలు, వైమానిక దళంలోని ఫ్లైయింగ్ బ్రాంచ్ కింద 92 (2 మహిళా అభ్యర్థులకు) ఖాళీలు, గ్రౌండ్ డ్యూటీస్ (టెక్నికల్) 18 (2 మహిళా అభ్యర్థులకు), గ్రౌండ్ డ్యూటీస్ (నాన్-టెక్నికల్) 10 (2 మహిళా అభ్యర్థులకు) ఖాళీలు,
నావల్ అకాడమీ (10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్) కింద 36 (5 మహిళా అభ్యర్థులకు) ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 11, 2024
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2024
దరఖాస్తు ఫారమ్లో దిద్దుబాట్లు చేయడానికి తేదీలు: జనవరి 1, 2025 నుండి జనవరి 7, 2025 వరకు
NDA (I) పరీక్ష 2025 తేదీ: ఏప్రిల్ 13, 2025
విద్యార్హతలు:
సైన్యం విభాగం: 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
నావికాదళం , వైమానిక దళం విభాగాలు: 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్ , మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత.
వయో పరిమితి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) (I) పరీక్ష 2025 నోటిఫికేషన్ కింద ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 2, 2006 మరియు జూలై 1, 2009 మధ్య జన్మించిన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు రుసుము:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు: ₹100
ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులకు: రుసుము లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) (I) పరీక్ష 2025 నోటిఫికేషన్ కింద అర్హత గల అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
వ్రాత పరీక్ష: ఏప్రిల్ 13, 2025న నిర్వహించబడుతుంది.
ఇంటర్వ్యూ: లిఖిత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.
పరీక్ష విధానం:
వ్రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది:
పేపర్ I: మ్యాథమెటిక్స్ (300 మార్కులు)
పేపర్ II: జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు)
జనరల్ ఎబిలిటీ టెస్ట్లో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మరియు సైన్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్య గమనిక:
అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అన్ని అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం UPSC అధికారిక నోటిఫికేషన్ను చూడండి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications