Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CTET July 2024 : సీటెట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..

సీటెట్ రాసే అభ్య‌ర్థుల‌కు సీబిఎస్ఈ ఓ శుభవార్త‌ను అందించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజ‌బిలిటి టెస్ట్‌ (CTET) దరఖాస్తుల గడువును పొడిగించింది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు గ‌డువు ఏప్రిల్ 2వ తేదితో ముగిసింది. అయితే, సీటెట్ రాసే అభ్య‌ర్థుల సంఖ్య‌ను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ ఈ నిర్ణ‌యిం తీసుకుంది. కేంద్రీయ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (సీటెట్‌) గడువును ఏప్రిల్‌ 5 వరకు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది అభ్య‌ర్థుల‌కు ఒక సువ‌ర్ణావ‌కాశ‌మ‌నే చెప్పాలి. కాబ‌ట్టి అర్హ‌త‌, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ https://ctet.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజ‌బిలిటి టెస్ట్‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం రెండు సార్లు నిర్వ‌హిస్తారు. ఒక‌టి జూలై సెష‌న్‌లో జ‌ర‌గ‌గా, రెండోది డిసెంబ‌ర్ సెష‌న్‌లో జ‌రుగుతుంది. ఈ ఏడాది జూలై సెష‌న్ 2024 సంబంధించిన నోటిఫికేష‌న్‌ను గ‌త నెల‌లో ప్ర‌క‌టించారు. 19వ ఎడిషన్‌ సీటెట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా 136 నగరాల్లో నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష 20 భాషల్లో ఉంటుంది. జులై 7వ తేదీన (ఆదివారం) దేశ‌వ్యాప్తంగా సీటెట్ ప‌రీక్ష‌ను నిర్వహించనున్నారు. ఇది ఆఫ్‌లైన్ (పెన్ను పేప‌ర్ విధానంలో ఉంటుంది) ప‌రీక్ష‌. ఈ ప‌రీక్ష‌లో మొత్తం రెండు పేప‌ర్లు ఉంటాయి. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారికోసం నిర్వ‌హించే ప‌రీక్ష‌. పేపర్-2 ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాసే ప‌రీక్ష‌.

CTET July 2024 Good news for CTET aspirants Extension of application deadline

ఏప్రిల్ 5వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..

ఈ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణ‌త ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు లైఫ్‌లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకయితే రూ.1200 ఉంటుంది. ఇక‌, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకయితే రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రెండు సెష‌న్‌ల‌లో ఉంటుంది. ఉద‌యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేప‌ర్ 2 ప‌రీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేప‌ర్ 1 ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌. కాబ‌ట్టి అభ్య‌ర్థులు ఏప్రిల్ 5వ తేది అర్థ‌రాత్రి వ‌ర‌కు ద‌రఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+