తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు తొలగిన అడ్డంకి
తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది.
దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా, పిటిషన్ కొట్టివేతతో గ్రూప్1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు టీజీసెట్-2025 చీఫ్ కన్వీనర్ అలుగు వర్షిణి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసీ క్యాటగిరీలకు చెందిన 36,334 మందికి సీట్లు లభించాయని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలకు 89,246 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,672 మంది పరీక్షకు హాజరైనట్టు చెప్పారు. 5వ తరగతిలో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఇదివరకే ప్రత్యేక కేటగిరీ కింద 1944 సీట్లను భర్తీ చేశామని, మిగిలిన 13,130 సీట్లను వివిధ క్యాటగిరీల నుంచి దశలవారీగా భర్తీ చేస్తామని చీఫ్ కన్వీనర్ వర్షిణి తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications