దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధ పడుతున్నారని తెలుస్తుంది. శ్యామ్ సుందర్ రెడ్డిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికి కూడా లాభం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మరణించారని వైద్యులు ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 86 ఏళ్లు. దిల్ రాజు తండ్రి మరణించారనే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్గా తెలుస్తుంది. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు మూడో కుమారుడే దిల్ రాజు. ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్కు వచ్చిన ఆయన..ఇక్కడే స్థిరపడ్డారు. నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా 'దిల్'. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో..దిల్ రాజు' ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఉదయం మహాప్రస్థానం'లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
-
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications