Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బిగ్ షాక్: సుప్రీంకోర్టులో దక్కని ఊరట

Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బిగ్ షాక్ తగిలింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ హైకోర్టు ఆదేశాలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ కేసు ట్రయల్ కోర్టులోనే జరుగుతుందని, జాక్వెలిన్ అక్కడే తన వాదనలు వినిపించుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఏమంటున్నారు?
తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ అంటున్నారు. సుఖేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి తనకు తెలియదని ఆమె వాదించారు. సుఖేష్ నుంచి అందుకున్న ఖరీదైన బహుమతులు అక్రమ సంపాదనతో కొనుగోలు చేసినవని కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పుడు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ తన న్యాయ పోరాటాన్ని ట్రయల్ కోర్టులో కొనసాగించాల్సి ఉంటుంది.

Jacqueline Fernandez Gets No Supreme Court Relief in Rs 200 Crore Money Laundering Case

జడ్జి ఏమన్నారంటే?
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. "మీకు రూ.200 కోట్ల బహుమతులు లభించాయనే ఆరోపణ ఉంది. అయితే ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా ఉన్నప్పుడు, వారిలో ఒకరు నేర కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, రెండవ వ్యక్తి పాత్ర ఏమిటో నిర్ణయించడం కష్టం. ఇలాంటి సందర్భాలలో, వాస్తవాలను లోతుగా పరిశీలించడానికి ట్రయల్ కోర్టే సరైన వేదిక" అని ఆయన పేర్కొన్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న్యాయవాది వాదన
సుప్రీంకోర్టు నిర్ణయంపై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాయర్ ప్రశాంత్ పాటిల్ స్పందించారు. ఈ కేసు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఛార్జీలను నిర్ధారించే దశలో ఉందని ఆయన చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా, పూర్తిగా నిష్పాక్షికంగా తమ వాదనలు వినాలని ట్రయల్ కోర్టును కోరడమే తమ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉద్దేశమని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కూడా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు పాటిల్ తెలిపారు. ట్రయల్ కోర్టు స్వతంత్రంగా ఛార్జీలపై విచారణ జరుపుతుందని, హైకోర్టు వ్యాఖ్యలు దానికి అడ్డంకి కావని సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+