ఉడిపిలో తల్లితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, అమ్మ కోరిక
పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉడిపిలోని శ్రీ కృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపురలోనే జన్మించారు.
జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపుర. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు నిలబడి తల్లితో కలసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ తన తల్లి పుట్టిన రోజు అని, ఆమె పుట్టిన రోజుకి నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదేనని జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

మా అమ్మ తన సొంత ఊరు కుందాపురకు పిలుచుకుని వెళ్లాలని నాతో చాలాసార్లు చెబుతూ ఉన్నారని, ఇంతకాలానికి ఆమె కోరిక నెరవేరిందని జూనియర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదే సందర్బంలో హోంబాలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరందూర్ కు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్ ( కేజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు) కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా తనతో కలిసి ఉడిపి గుడికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ మధుర క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
My mother's forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her.
— Jr NTR (@tarak9999) August 31, 2024
Thanks to @VKiragandur sir and my dearest… pic.twitter.com/sj3rtExmnp
కేజీఎఫ్ సినిమా దక్షకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడిగా మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో, ఆ సినిమా దర్శకుడు అయిన రిషబ్ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications