Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమన్నాకు రూ. 6.20 కోట్లు చెల్లించిన ప్రభుత్వం- ఏ మాయ చేసిందో గానీ..!!

Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. బంపర్ ఆఫర్ కొట్టారు. దీని వ్యాల్యూ 6.20 కోట్ల రూపాయలు. ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పై ఆమె సంతకం చేశారు.

కర్ణాటకలోని ప్రఖ్యాత మైసూర్ శాండల్ సోప్ కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. మైసూర్ శాండల్ సంస్థ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఆమె ప్రమోట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అడ్వర్టయిజ్ మెంట్లల్లో నటించనున్నారు. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం ఆమెకు ఈ 6.20 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించింది.

Karnataka Govt sanctions Rs 6 20 cr for Tamannah Bhatia to be brand ambassador of Mysore Sandal

ఈ మేరకు కర్ణాటక ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శాంతమ్మ ఎన్ ఎం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని, రెండు సంవత్సరాల రెండు రోజుల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగుతారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉత్తరాది రాష్ట్రానికి చెందిన తమన్నా భాటియా ఇంత భారీ ఆఫర్ ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తాయి. సొంత రాష్ట్రానికి చెందిన నటీనటులు గానీ, వీఐపీలను గానీ సిద్ధరామయ్య ప్రభుత్వం విస్మరించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ అయ్యాయి.

ఈ విమర్శలకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తమన్నా భాటియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దక్షిణం- ఉత్తరాది రాష్ట్రాల్లో తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తు చేశారు.

కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో మైసూర్ సోప్ అండ్ డిటర్జెంట్.. 81 శాతం మార్కెట్ ను కలిగివుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ స్థాయిలో తమ ఉత్పత్తులు ప్రమోట్ కావట్లేదని చెప్పారు. ఉత్తరాది మార్కెట్ లో ఆరు శాతం వాటా మాత్రమే ఉందని పేర్కొన్నారు. దీన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే తమన్నా భాటియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని అన్నారు.

కాగా- మైసూర్ శాండల్ సోప్, ఇతర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతం 23 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వచ్చే ఏడాది కాలానికి అంటే.. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే సమయానికి ఎగుమతులను 80 దేశాలకు పెంచుకోవాలని భావిస్తోంది. దీనికి అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది.

మైసూర్ శాండల్ బాత్ సోప్, డిటర్జెంట్ సోప్, బేబీ ఆయిల్, బేబీ సోప్, రెడ్ శాండల్ సోప్, బాడీ వాష్, టాల్కమ్ పౌడర్, హ్యాండ్ వాష్, మసాజ్ ఆయిల్, ఫేస్ ప్యాక్, అగరబత్తులు, కర్పూరం, ధూపం, లిక్విడ్ డిటర్జెంట్, ఫినాయిల్.. వంటి ప్రొడక్ట్స్ ను కర్ణాటక ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+