ఆ లేడి డైరెక్టర్తో మెగాస్టార్ రెండు గంటలు మీటింగ్.. రీజన్ ఏంటంటే ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్లో విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి సైతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే, జూన్ నెలలో నుంచి సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.
అలానే శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు మెగాస్టార్. ఇంతటి బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా చిరు ఓ లేడి డైరెక్టర్ కి రెండు గంటలు సమయం కేటాయించి.. కలవడం, మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతకీ ఆ లేడి దర్శకురాలు ఎవరు ? బాస్ ఏం మాట్లాడారు ? నెక్స్ట్ మూవీ ఆమెతో చేయబోతున్నారా అని హాట్ టాపిక్ గా డిస్కషన్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే ఆ లేడీ డైరెక్టర్ స్వాతినిగా తెలుస్తోంది. ఆమె గతంలో నిహారికతో ఓ సినిమా చేసింది. నిహారిక పెళ్లి కంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. రీసెంట్ గానే స్వాతిని ఆ మూవీని పూర్తి చేసింది. నిహారికతో స్వాతినికి మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ రిలేషన్తోనే ఇలా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చేసింది లేడి డైరెక్టర్. ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. చిరంజీవితో రెండు గంటలు ముచ్చట్లు పెట్టాను అంటే అసలు ఇది నిజమా? కలనా? అంటూ రాసుకోచ్చింది.
Pinch me, I must be dreaming !
— swathini (@swat_storyarc) February 10, 2025
Unforgettable two hours of my life ever
With the MEGASTAR CHIRANJEEVI sir 🙏
Ever grateful to @NagaBabuOffl sir and @IamNiharikaK for making this happen ♥️🙏 pic.twitter.com/9DFfYxs7xe
నన్ను గిచ్చి చూడండి..అసలు ఇది కలా? నిజమా? అన్నట్టుగా ఉందని ఎమోషనల్ అయ్యింది. నా జీవితంలో ఈ రెండు గంటల్ని ఎప్పటికీ మర్చిపోలేను పొస్త చేసింది. అంతే కాకుండా నిహారిక, నాగబాబుకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది స్వాతిని. ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications