ఉదయ్ కిరణ్ సినిమాలను హ్యాండిల్ చేసింది మెగా ఫ్యామిలీనే.. సంచలన విషయాలు బయటపెట్టిన బడా నిర్మాత
దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్ చిత్రాలతో యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందారు. లవర్ బాయ్ ఇమేజ్తో యువతలో, కుటుంబ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే, ఆ తర్వాత అతని కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, సరైన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మానసిక క్షోభే అతని ఆత్మహత్యకు ప్రధాన కారణమని భావించారు. అతని మరణంపై పలు అనుమానాలు, చర్చలు కూడా జరిగాయి, అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.అలా ఉదయ్ కిరణ్ మరణం సినీ పరిశ్రమకు ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.
#UdayKiran diary control cheyatam entra lucha behavior kakapothe !! 🤢🤮pic.twitter.com/DOXs87QdeL
— V@ndeM@taR@m (@patriotatwork99) June 2, 2025
అయితే ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, మెగా ఫ్యామిలీ ఆయన్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని భావించింది. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను ఉదయ్ కిరణ్కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఈ వివాహం ఆగిపోయింది. అల్లుడు కాబోతున్నాడనే కారణంతో, మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ కెరీర్ను తామే పర్యవేక్షించాలని నిర్ణయించుకుందట. అతని డైరీని కూడా తీసుకుని, ఏ సినిమాలు చేయాలి, ఏ సినిమాలు చేయకూడదు అని అల్లు అరవింద్ నిర్ణయించారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు,జయభేరి అధినేత మురళి మోహన్ బయటపెట్టారు.

ఈ ప్రస్తావనకు ముందే ఉదయ్ కిరణ్ 'అతడు' సినిమాను ఒప్పుకున్నారని, అయితే అల్లు అరవింద్ ఈ సినిమాను చేయవద్దని చెప్పడంతో ఉదయ్ ఆ అవకాశాన్ని కోల్పోయాడని మురళి మోహన్ తెలిపారు. ఆ తర్వాత 'అతడు' సినిమా మహేష్ బాబు చేసి బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, ఉదయ్ కిరణ్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయాడు. ఇలా ఎన్నో మంచి సినిమాలను కోల్పోయిన ఉదయ్ కిరణ్, అనుకోని కారణాల వల్ల మెగా ఫ్యామిలీకి అల్లుడు కాలేకపోయాడు.ఈ పరిణామాలన్నీ ఉదయ్ కిరణ్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపాయని, అవకాశాలు తగ్గిపోవడం, చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకుంది.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications