విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం.. మెట్లపై నుంచి స్లిప్ అయిన రౌడీ హీరో..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ల మీద నుంచి దిగుతుండగా.. కాలు జారి స్లిప్ అయ్యి పడ్డాడు విజయ్. ఈ సంఘటనుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే, కిందపడ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం సురక్షితంగా లేపి బయటకు తీసుకొచ్చారు. ఇక, ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్ మాత్రం విజయ్కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం విజయ్ హీరియే పాటతో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జాస్లీన్ రాయల్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారు.
ఇక, ఈ ఘటన ముంబైలోని మితిబాయి క్షితిజ్ లో చోటుచేసుకుంది. మిథిబాయి క్షితిజ్ అంటే మిథిబాయి కళాశాల యాన్యువల్ కల్చరల్ ఫోర్ డేస్ ఫెస్ట్. 'సాహిబా' ఆల్బమ్ ప్రమోషన్స్లో భాగంగా పాల్గొన్న విజయ్కీ తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఆల్బమ్లో విజయ్ సరసన రాధిక మోహన్ నటిస్తుంది. ఇప్పటికే రాధికా- జస్లీన్ రాయల్ కాంబినేషన్లో పాట వచ్చిన సంగతి తెలిసిందే . అదే 'నై జానా' సాంగ్. ఇది ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దీంతో ఇక, విజయ్ సాంగ్ ఎలా ఉండబోతుందా? అని ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఆల్బమ్కి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్న్ కూడా విడుదల చేశారు. ఈ సాంగ్ను నవంబర్ 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సాహిబా ప్రమోషన్స్లో భాగంగా ముంబయిలోని మితిబాయి క్షితిజ్లో విజయ్ పాల్గొన్నారు. ఆ సమయంలో మెట్లపై నుంచి జారి పడ్డాడు. అయితే, వెంటనే అలర్ట్ అయిన టీం విజయ్ ను వెంటనే పైకి లేపి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు.

మూవీ షూటింగ్లో ప్రమాదం..
అయితే, ఇటీవలే విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. విరామం తీసుకునే సమయం లేనందున షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్లుగా కూడా ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. విజయ్ గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లోనే విజయ్ గాయపడ్డాడు. అయినా విశ్రాంతి లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మెట్ల మీద నుండి జారీ కిందపడ్డ విజయ్ దేవరకొండ#VijayDevarakonda #DevarakondaVijay pic.twitter.com/bI6f1upPWq
— oneindiatelugu (@oneindiatelugu) November 8, 2024












Click it and Unblock the Notifications