కెసిఆర్ కు చంద్రబాబు దెబ్బ

చంద్రబాబు అతి విశ్వాసం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. తెరాస ద్వారా తెలంగాణలో లాభపడి దాన్ని దెబ్బ తీయాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఎన్నికలకు ముందు నుంచే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టించారని చెప్పవచ్చు. సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని కాకుండా కెసిఆర్ అనుసరించిన వైఖరే ఎక్కువ విమర్శలకు దారి తీయడం వెనక ఆ ఎత్తుగడ ఉందని అంటున్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయిన చివరి నిమిషంలో తెరాసకు కేటాయించిన 16 అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులకు బీ - ఫారాలు ఇచ్చారు. దీంతో తీవ్రమైన గందరగోళం నెలకొంది.
చంద్రబాబు సన్నిహిత మిత్రుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కాంగ్రెస్ ను ఓడించడానికి త్యాగాలకు సిద్ధమన్నారు. కానీ చివరి నిమిషంలో కొద్ది పాటి సీట్ల కోసం మొండి పట్టు పట్టారు. సీట్ల సర్దుబాటును గందరగోళపరిచారు. పైగా చంద్రశేఖరరావుపై నిందలు మోపుతూ వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా ప్రతిదానికీ చంద్రశేఖర రావును తప్పు పడుతూ వచ్చారు. పొత్తుల ధర్మాన్ని విస్మరించి ఆ ముగ్గురు నాయకులు తెరాస నాయకుడు చంద్రశేఖరరావును, తెలంగాణవాదాన్ని దెబ్బ తీయడానికి పూనుకున్నారనే విమర్శ ఉంది.
తెరాస అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమా వల్లనే చంద్రబాబు తెరాసపై కత్తి కట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీక్షకు పూనుకుని నిందను తెరాస మీదికే నెట్టారు. తెరాసతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, ఆయనకు కొమ్ము కాస్తున్న దినపత్రిక వ్యాఖ్యానించే దాకా వెళ్లాయి. నిజానికి, తెరాసతో పొత్తు పెట్టుకోకపోతే తెలంగాణలో టిడిపి ఉనికి కూడా ప్రమాదంలో పడి ఉండేదే. ప్రజారాజ్యం పార్టీకి పడిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆ విషయం అర్థమవుతుంది. తెరాస ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి గానీ సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం ఓట్లు తెరాసకు పడలేదు. దీంతో తెరాస చాలా స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. వరంగల్ పార్లమెంటు సీటులో తెలుగుదేశం అధికారిక అభ్యర్థి పోటీలో ఉండడం వల్లనే తెరాస అభ్యర్థి ఓడిపోయాడు.
ఇదే సమయంలో చంద్రశేఖర రావు అతి విశ్వాసం కూడా కొంప ముంచింది. తెలుగుదేశం, తెరాస పొత్తు కాంగ్రెసు నడ్డి విరుస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆ ప్రభుత్వంలో తాము చేరుతామని కెసిఆర్ కలలు కన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ వాదానికి తక్కువ చంద్రబాబు హామీలను ఎక్కువ భుజాన మోశారు. ఫలితాలు వెలువడిన తర్వాత గానీ చంద్రబాబు, ఆయన మిత్రులు చేసిన నిర్వాకమేమిటో కెసిఆర్ కు ఎక్కలేదు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications