వైయస్ జగన్ అరెస్టుకు పొలిటికల్ స్క్రిప్టు

రాష్ట్ర రాజకీయాల్లో స్టార్లా ముందుకు వచ్చిన వైయస్ జగన్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు నాయుడు వంటి నాయకులు వెలవెలబోతున్నారు. ఎన్నికల్లో వైయస్ జగన్ను ఎదుర్కోలేమని ప్రత్యర్థులు గుర్తించారు. దాంతోనే దర్యాప్తుల్లో ఇరికించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెసు ఇతర హైకమాండ్ పెద్దలు జగన్ను ప్రజల ముందు ఎదుర్కోలేని పరిస్థితి. కడప లోకసభ స్థానం పరిధిలోని అన్ని శానససభా నియోజకవర్గాల్లో జగన్కు మెజారిటీ రాగా, ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన అమేథీ, రాయబరేలీ స్థానాల్లో కాంగ్రెసు మెజారిటీ కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్కు చెందినంత వరకు జగన్ కింగ్. జగన్ మాదిరిగా ప్రజల ముందు నిలబడే నాయకుడు కాంగ్రెసులో లేడు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు అప్రజాస్వామిక, లజ్జారహిత విధానాల వల్లనే జగన్ అరెస్టు అవుతారు. కాంగ్రెసు పార్టీ చంద్రబాబు, అంబానీ సోదరులు, రామోజీరావులతో కుమ్మక్కయి ఆ పని చేయిస్తోంది. రాజకీయంగా జగన్ను అణచివేయడానికి, వైయస్సార్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏనాడూ పాలు పంచుకోని వైయస్ జగన్ అధికార దుర్వ్నినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో అరెస్టవుతారు. పలు కుంభకోణాల్లో పాలు పంచుకున్న చంద్రబాబు స్వేచ్ఛగా ఎలా తిరుగుగలుగుతారు.
వైయస్ జగన్ అరెస్టు సహేతుకమని ప్రజల ముందు అనిపించడానికే మంత్రి మోపిదేవి వెంకరమణను అరెస్టు చేశారు. మరింత మంది మంత్రులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మన దేశాన్ని ఎటు తీసుకుని పోతున్నాయి. దేశమంటే, ప్రజలంటే వారికి భయం లేదా. రెండు పేజీల శంకరరావు లేఖపై న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో సోనియా ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు.
గత ఇరవై ఏళ్లుగా జరిగిన అవినీతిపై, కుంభకోణాలపై దర్యాప్తును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆశిస్తోంది. కేవలం వైయస్ జగన్ ఒక్కడి మీదనే కేంద్రీకరించకూడదని అంటోంది. జగన్ ఒక్కడే కాకుండా అందరికీ ఆ సెగ తగలాలి. అవినీతిపరుడైతే రెండోసారి వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావడాన్ని కాంగ్రెసు అనుమతించింది. కాంగ్రెసును 2004, 2009 - రెండు సార్లు వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి తెచ్చారు. వైయస్ మరణం తర్వాత సోనియా పిరిగ్గా వ్యవహరిస్తున్నారు. అందుకు చంద్రబాబుతో పాటు సోనియా గాంధీ కూడా విచారించాల్సి వస్తుంది.
- గురువా రెడ్డి, అట్లాంటా
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications