నాపై మత వివక్ష: హష్మీ

లక్ష రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత కూడా సొసైటీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆరోపిస్తూ హష్మీ ఫిర్యాదు చేసినట్లు కమిషన్ వైస్ చైర్మన్ అబ్రహం మథాయి చెబుతున్నారు. సొసైటీకి సమన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ తల్లిదండ్రులు సొసైటి సభ్యులను కలవడానికి గతవారం వెళ్లారని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం విక్రయదారు, బ్రోకర్లతో వారు వెళ్లారని, అయితే తమకు తీరిక లేదని సొసైటీ సభ్యులు చెబుతూ కలవడానికి నిరాకరించారని, దీంతో తన మనోభావాలు దెబ్బ తిన్నాయని హష్మీ అంటున్నారు.
తమకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వబోమని, తాము విక్రయాన్ని అపేశామని సొసైటీ సభ్యులు చెప్పినట్లు విక్రయదారు సువర్ణ చెప్పినట్లు ఆయన తెలిపారు. సొసైటీలో చాలా మంది హిందువులు, కొంత మంది కాథలిక్కులు ఉన్నారని, దాంతో ముస్లింలం అయినందున తమకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని హష్మీ అంటున్నారు.
తమకు హష్మీ నుంచి లేఖ అందిందని, అయితే సొసైటీ అధ్యక్షుడు అందుబాటులో లేనందున ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదని హౌసింగ్ సొసైటీ కార్యదర్శి చత్రి ఒక ఆంగ్లదినపత్రిక ప్రతినిధితో అన్నారు. ముస్లింలకు నిషేధమేదీ లేదని, ముస్లింలందరూ టెర్రరిస్టులు కారని తమకు తెలుసునని, దేశంలోని అన్ని రకాలవారు ఇక్కడ ఉంటారని, తాను దేశంలోని వేరే ప్రాంతం నుంచి వచ్చినవాడినని, ఎవరు వస్తున్నారనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.
సొసైటీ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నటుడు అనిల్ ధావన్ వాదన మరో రకంగా ఉంది. హష్మీ తన పొరుగువాడిగా రావడం తనకు ఆనందంగా ఉంటుందని, సొసైటీ సమావేశం జరుగుతుండగా హష్మీ కుటుంబ సభ్యులు కార్యాలయంలోకి దూసుకొచ్చారని, అందువల్ల వారిని కలవడానికి తాము నిరాకరించామని, సెలిబ్రిటీ అయినంత మాత్రాన ఏదైనా చేయవచ్చుననేది మంచిది కాదని ఆయన అన్నారు.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications