వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లితెర దాడుల'సీ'రియల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Attacks on TV Artists
టీవీ ఆర్టిస్టులపై దాడులు ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. వరుసగా ఇద్దరు టీవీ ఆర్టిస్టులపై దాడులు జరగడం ఈ కలకలానికి కారణం. శ్రీధర్ వర్మ, డింపుల్ అనే ఇద్దరు టీవీ సీరియల్ నటులపై దాడులు జరిగాయి. దీంతో బుల్లితెర ఆందోళనకు గురవుతోంది. టీవీ సీరియల్స్ కు, వాటిలో నటించే అర్టిస్టులకు ఇటీవలి కాలంలో ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పెరిగింది. నటీనటులకు అభిమానులు కూడా పెరిగారు. ఇంటింటా కొన్ని సీరియల్స్ ను తప్పకుండా చూసే ప్రేక్షకులున్నారు. అక్షరాస్యత లేని పల్లె ప్రజలు కూడా వాటిని చూడకుండా ఉండలేని స్థితి ఉంది. ఈ స్థితిలో టీవీ ఆర్టిస్టుల్లో ఆధిపత్య పోరు పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఆధిపత్య పోరే దాడులకు కారణమని భావిస్తున్నారు.

రెండు దాడుల వెనక సెల్వరాజ్ అనే నటుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరాధన, తూర్పు పడమర, మొగలిరేకులు సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి వేరే నటులను పెట్టారు. ఆరాధన, తూర్పు పడమర సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి శ్రీధర్ వర్మను తీసుకున్నారు. తూర్పు పడమర సీరియల్ లో డింపుల్ నటిస్తోంది. మొగలిరేకులు, ఆరాధన సీరియల్స్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సీరియల్ మధ్యలో ఓ నటుడ్ని తీసేసి మరో నటుడ్ని పెట్టడం చాలా మంది జీర్ణం కావడం లేదు. సెల్వరాజ్ కు అభిమానుల సంఖ్య ఎక్కువే. మొగలి రేకులు సీరియల్ లో అతను విలనిజాన్ని పండించిన తీరు చాలా మందికి నచ్చింది.

సీరియల్స్ కు పెరుగుతున్న ఆదరణ, నటులకు పెరుగుతున్న ఆభిమానులు బుల్లితెరను కుదిపేస్తున్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఆదరణతో టీవీ ఆర్టిస్టుల్లో ఆధిపత్య పోరు అధికమైందని, దాడులకు అదే కారణం కావచ్చునని భావించే వారున్నారు. అయితే, సీరియల్స్ కు మరింత ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో కూడా దాడుల డ్రామాలను పండిస్తూ ఉండవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా, బుల్లితెర పరిస్థితి అంత సజావుగా లేదనే విషయం అందరికీ తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X