వ్యక్తిని కాల్చి చంపిన టీవీ9?

ఆస్తి తగాదాపై పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా ఒంటికి నిప్పంటించుకోవాలని కల్పేష్ మిస్త్రీని టీవీ9 జర్నలిస్టులు మయూర్ రావల్, కమలేష్ రావల్ ప్రోత్సహించారని పోలీసులు ఆరోపించారు. వారికి జిటిపిఎల్ అనే స్థానిక కేబుల్ కంపెనీ కూడా ఉంది. ఒంటికి నిప్పంటించుకోవడంతో 29 ఏళ్ల కల్పేష్ మిస్త్రీ 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. మంటలను ఆర్పడానికి బదులు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ దృశ్యాన్ని చిత్రీకరించడంలో మునిగిపోయారు. దాని గురించి భయపడవద్దని, ఇదంతా డ్రామా అని చెప్పినట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, పోలీసులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ జర్నలిస్టులు ఆందోళనలకు కూడా దిగారు.
అకస్మాత్తుగా ఈ వార్తాకథనం తెలుగు టీవీ చానెళ్లకు ముడి సరుకుగా మారింది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న టీవీ9పై తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ తీవ్రంగా మండిపడుతోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయంపై పరిశీలన జరుపుతున్నామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పినట్లు టివీ9 ప్రసారం చేసిన వార్త కూడా వివాదమైంది. ఆ వార్తపై రాజ్ న్యూస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఇప్పుడు తాజా టీవీ9 గుజరాత్ టీవీ చానెల్ జర్నలిస్టుల ఉదంతానికి వెలికి తీసింది. టీఆర్పీ రేటింగ్ కోసం తాపత్రయపడిన టీవీ చానెల్ ఓ మనిషి ప్రాణం తీసిందని రాజ్ న్యూస్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications