కోచ్ ఎంపికలో ట్విస్ట్, కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్కు షేర్లు
ముంబై: టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లే ఎంపిక పైన కొత్త కోణం వెలుగు చూసింది! హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సెలక్టర్లు కుంబ్లే వైపు మొగ్గు చూపారు. తనను ఎంపిక చేసుకోకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గంగూలీ-శాస్త్రి మధ్య వాగ్యుద్ధం సాగింది.
కోచ్గా కుంబ్లేను ఎంపిక చేసిన కమిటీలో సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ తదితరులు ఉన్నారు. ఈ కమిటీ సూచన మేరకే కుంబ్లే ఎంపికయ్యారు. కుంబ్లే ఎంపిక.. 'పరస్పర ప్రయోజన' కోణం కనిపిస్తున్నట్లుగా ఉందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

కుంబ్లే క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత, 2011లో టెన్విక్ స్పోర్ట్స్ పేరిట ఓ కంపెనీని పెట్టాడు. టెన్నిస్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్లు కూడా కుంబ్లే కంపెనీలో షేర్ హోల్డర్లు.
ఈ కంపెనీతో వీవీఎస్ లక్ష్మణ్ 2012లో 16,666 ఈక్విటీ షేర్లను కొన్నాడు. ఆ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నాటికి రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టెన్వీ స్పోర్ట్స్లో లక్ష్మణ్కు 33,332 షేర్లు ఉన్నాయి. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీ అధినేతగా ఉన్నందునే లక్ష్మణ్ కోచ్ పదవికి... కుంబ్లేను ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్కు వాటాలున్న సంగతి సచిన్, గంగూలీలకు తెలుసో లేదో తెలియదని చెబుతున్నారు.
-
టీమిండియాలో గుర్తింపునకు నోచుకోని స్టార్ ఆల్ రౌండర్- ఫైనల్ లో ఎక్స్ ఫ్యాక్టర్ -
భారత్ ను ఫైనల్ చేర్చిన రియల్ హీరో అతనే, గేమ్ ఛేంజర్ - మలుపు తిరిగింది అక్కడే..!! -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
బౌలింగ్ తో బేజార్- ఆ ఇద్దరి ఫ్లాప్ షో -
పాపా.. నువ్వు ఆ షాట్ ఎందుకు ఆడావు? వీడియో -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
మనకు తెలియట్లేదు గానీ కివీస్ బ్యాడ్ ట్రాక్ రికార్డుంది భయ్యో -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్












Click it and Unblock the Notifications