కళా వారసత్వం: ‘కాళోజీ కళాక్షేత్రం’(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత చరిత్రను సంపన్నం చేసిన కాకతీయుల కళావారసత్వాన్ని నిలబెట్టే రీతిలో వరంగల్లో ప్రజాకవి, తెలంగాణ స్వాప్నికుడు కాళోజీ నారాయణరావు పేరిట కళా క్షేత్రాన్ని నిర్మించనున్నట్లు గిరిజన అభివృద్ధి, టూరిజం సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆడిటోరియం డిజైన్ను విడుదల చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల కళాఖండాలు ఎంతో దివ్యమైనవని, చరిత్రాత్మకమైనవని అన్నారు. ఆ స్థాయిలో కొనసాగింపుగా కళాభవనం ఉండాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఔన్నత్యానికి తగ్గట్టుగా భవనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
హన్మకొండలోని బాల సముద్రంలో 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి ప్రతిబింబిచేలా కవులు, కళాకారులు, వృత్తిదారులకు ఈ కళాభవనం వేదిక కానుందని పేర్కొన్నారు. కళాకారుల అవసరాలకు తగ్గట్టుగా దాదాపు వెయ్యిమంది కూర్చునేలా అతిపెద్ద ఆడిటోరియం నిర్మించనున్నట్లు తెలిపారు.
వృత్తిదారుల విలువను పెంచేలా ఆర్ట్గ్యాలరీ నిర్మాణం చేస్తామన్నారు. గ్రంథాలయం, సమావేశ మందిరం, వర్క్షాప్ హాల్స్, వాహనాల కోసం పార్కింగ్ మెరుగైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల రూపాయలు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని, మిగితా మొత్తాన్ని సహాయంగా అందించాలని కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు.
సెప్టెంబర్ 8వ తేదీ కాళోజీ జయంతి నాటికి పాక్షికంగానైనా ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రజలు ఈ భవనాన్ని తమ కళావారసత్వంగా స్వీకరిస్తారని, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అక్షర దీపమై వెలిగిన మహాకవి కాళోజీ స్ఫూర్తి, కాకతీయుల కళావారసత్వం ఈ భవన నిర్మాణానికి ప్రేరణ అని మంత్రి చందూలాల్ పేర్కొన్నారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
తెలంగాణ ప్రాంత చరిత్రను సంపన్నం చేసిన కాకతీయుల కళావారసత్వాన్ని నిలబెట్టే రీతిలో వరంగల్లో ప్రజాకవి, తెలంగాణ స్వాప్నికుడు కాళోజీ నారాయణరావు పేరిట కళా క్షేత్రాన్ని నిర్మించనున్నట్లు గిరిజన అభివృద్ధి, టూరిజం సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆడిటోరియం డిజైన్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల కళాఖండాలు ఎంతో దివ్యమైనవని, చరిత్రాత్మకమైనవని అన్నారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
ఆ స్థాయిలో కొనసాగింపుగా కళాభవనం ఉండాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఔన్నత్యానికి తగ్గట్టుగా భవనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
హన్మకొండలోని బాల సముద్రంలో 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి ప్రతిబింబిచేలా కవులు, కళాకారులు, వృత్తిదారులకు ఈ కళాభవనం వేదిక కానుందని పేర్కొన్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications