గణేశుడి లడ్డూలను పాడుకున్న ముస్లింలు
హైదరాబాద్: తెలంగాణలో వినాయక ఉత్సవాలు మత సామరస్యాన్ని చాటాయి. ముస్లింలు వేలం పాటల్లో వినాయకుడి లడ్లను సొంతం చేసుకున్నారు. హైదరాబాదులో 45 ఏళ్ల ముస్లిం వ్యాపారవేత్త మొహమ్మద్ నజీరుద్దీన్ చాంద్రాయణగుట్ట వినాయకుడి లడ్డును పాడుకున్నారు. రూ.1.21 లక్షల రూపాయలకు ఆ లడ్డును కొనుక్కున్నాడు.
వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకంతోనే తాను లడ్డును పాడుకున్నట్లు ఆయన తెలిపారు తాను 2006లో కంచన్బాగ్ లడ్డు వేలం పాటలో పాల్గొని 11 వేల రూపాయలకు పాడుకున్నట్లు, ఆ లడ్డు ప్రసాదాన్ని నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గల తన పొలాల్లో చల్లినట్లు, ఆ తర్వాతి ఏడాది పంటలు బాగా పండినట్లు నజీరుద్దీన్ తెలిపారు. ఆయనకు యాకుత్పురాలో ఎలక్ట్రికల్ షాపు ఉంది.

ఇదిలావుంటే, గణేష్ లడ్డూని వేలంపాటలో ఓ ముస్లిం సోదరుడు దక్కించుకున్న సంఘటన వరంగల్లోని సెకండ్ బ్యాంక్ కాలనీలో జరిగింది. దీంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను వేలం పాటలో రూ. 51వేలకు మహ్మాద్ రషీద్ సొంతం చేసుకున్నాడు. లడ్డూని దక్కించిన సంతోషంలో రషీద్ మాట్లాడుతూ గణేష్ లడ్డూని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
వినాయకుడి లడ్డూలు లక్షల రూపాయలు పలికిన సంఘటనలు హైదరాబాదులో పలు చోట్ల జరిగాయి. విశాఖపట్నంలోని ఓ వినాయకుడి లడ్డు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications