వాలెంటైన్స్ డేకు భద్రత: ప్రేమికులు ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే)ను అడ్డుకోనున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ పిలుపునివ్వటంతో నగర పోలీసులు పలు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం నగరంలోని నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, ట్యాంక్బండ్, లుంబినీపార్కు, ఇందిరాపార్కు, చాచా నెహ్రూ పార్కు, ఎన్టీఆర్ పార్కు, కెబిఆర్ పార్కుల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
పోలీసుల భద్రత మధ్య ప్రేమజంటలు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నాయి. కాగా, వనస్థలిపురంలో ఓ ప్రేమ జంటను పట్టుకుని బజరంగ్దళ్ నేతలు పెళ్లి చేసినట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించటం లేదు. నగరంలోని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్రెడ్డి సంజీవయ్యపార్కులో బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు.
ఇక్కడ ప్రేమికులు జరుపుకుంటున్న ఉత్సవాల్లో తనిఖీలు నిర్వహించి పదకొండు మంది భజరంగ్దళ్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి రాంగోపాల్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లోని పలు పేరుగాంచిన హోటళ్లలో వాలైంటేన్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
కాగా, సంజీవయ్య పార్కులో శివసేన, ఏబివిపి, బజరంగ్ దళ్ నేతలను అరెస్టు చేసినందుకు నిరసనగా సికిందరాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వాలెంటైన్స్ డేకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సెంట్రల్ జోన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
వాలెంటైన్స్ డే
ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్స్ డేను అడ్డుకోనున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ పిలుపునివ్వటంతో నగర పోలీసులు పలు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
వాలెంటైన్స్ డే
శనివారం నగరంలోని నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, ట్యాంక్బండ్, లుంబినీపార్కు, ఇందిరాపార్కు, చాచా నెహ్రూ పార్కు, ఎన్టీఆర్ పార్కు, కెబిఆర్ పార్కుల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
వాలెంటైన్స్ డే
వనస్థలిపురంలో ఓ ప్రేమ జంటను పట్టుకుని బజరంగ్దళ్ నేతలు పెళ్లి చేసినట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించటం లేదు.
వాలెంటైన్స్ డే
నగరంలోని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్రెడ్డి సంజీవయ్యపార్కులో బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు.
వాలెంటైన్స్ డే
విహెచెపి, భజరంగ్ దళ్ లాంటి హిందూ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పలు పార్కులు ప్రేమ జంటలు లేక బోసిపోయాయి.
వాలెంటైన్స్ డే
ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్స్ డేను అడ్డుకోనున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ పిలుపునివ్వటంతో నగర పోలీసులు పలు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
వాలెంటైన్స్ డే
శనివారం నగరంలోని నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, ట్యాంక్బండ్, లుంబినీపార్కు, ఇందిరాపార్కు, చాచా నెహ్రూ పార్కు, ఎన్టీఆర్ పార్కు, కెబిఆర్ పార్కుల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
వాలెంటైన్స్ డే
వనస్థలిపురంలో ఓ ప్రేమ జంటను పట్టుకుని బజరంగ్దళ్ నేతలు పెళ్లి చేసినట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించటం లేదు. నగరంలోని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్రెడ్డి సంజీవయ్యపార్కులో బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు.
వాలెంటైన్స్ డే
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని విస్మరించి సంస్కృతిని దెబ్బతీస్తున్న వాలెంటైన్స్ డేను భారతీయులు జరుపుకోవడం సిగ్గుచేటని ఓల్డ్ బోయిన్పల్లి బజరంగ్ దళ్ అధ్యక్షుడు ఎన్. శంకర్ అన్నారు.
వాలెంటైన్స్ డే
శంకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14,1931లో దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన భగత్సింగ్, రాజ్గురూ, సుఖ్దేవ్ భట్టాచార్యులు ఉరితీసిన సంఘటనను మరిచిపోయి, దేశ సంస్కృతి కాని వాలెంటైన్స్ డే జరుపుకోవడాన్ని విమర్శించారు.