జయలలిత కోసం ఆనాడు గుడి తలుపులు తెరిచి ఉంచారు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2001లో కన్నూరులోని తాలిపరమాంబలో గల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లిన సంఘటన వివాదాస్పదమయింది.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2001లో కన్నూరులోని తాలిపరమాంబలో గల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లిన సంఘటన వివాదాస్పదమయింది. ప్రముఖ ఆస్ట్రాలజర్ పరప్పనగండి ఉన్నికృష్ణన్ పనిక్కర్ సూచన మేరకు జయ ఆ రోజు తన నెచ్చెలి శశికళతో కలిసి ఆలయానికి వెళ్లారు.
శశికళ వల్లే, పన్నీరు చేయలేరు, జయకు భయంకర అనుభవం.. నా కోసం అప్సెట్: స్వామి
ఈ ఆలయంలో అథజ పూజ (పవళింపు సేవ) చేస్తారు. ఈ ఆలయం ఆచారం ప్రకారం ఈ పూజ అయ్యే వరకు మహిళలను లోనికి రానివ్వరు. ఆ తర్వాత గుడి మూస్తారు. కానీ జయలలిత తన సన్నిహితురాలు శశికళతో కలిసి ఆ రోజు సాయంత్రానికి అక్కడకు చేరుకున్నారు. ఆలయ ఆచారాన్ని పక్కన పెట్టి జయలలిత కోసం అధికారులు గుడిని రాత్రి గం.9.30 వరకు తెరిచి ఉంచారు.
ఇక్కడ మరో వివాదం కూడా ఉంది. అక్కడ, ఆలయంలోకి వెళ్లేందుకు ఒక వుడెన్ స్టెప్ ఉంది. దానిని క్రాస్ చేసేందుకు జయలలిత ఇబ్బంది పడ్డారు. దీంతో దానిని కట్ చేశారు.

అనంతరం ఆమె తిరుగు పయనం అయ్యారు. మధ్యలో జాతీయ రహదారిలోని పప్పినిస్సెరీ వద్ద జయలలిత కాన్వాయ్ ఆగింది. జయలలిత డిన్నర్ చేయడం కోసం దాదాపు గంట పాటు అక్కడ కాన్వాయ్ నిలిపివేశారు. ఆమె కాన్వాయ్ జాతీయ రహదారి పైన ఆగడంతో అది వివాదాస్పదమయింది. ట్రాఫిక్ జాం కావడంతో పాక్షికంగా దారి ఇచ్చారు.
ఇదిలా ఉండగా, జయలలిత రాకతో గుడి మరింత పాపులర్ అవుతుందని భావించారు. ఆమె గుడికి వచ్చిన తర్వాత గుడి పాపులర్ అయిందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని, వస్తున్న భక్తులలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా ఉన్నారని టెంపుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ చెప్పారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications