బాబు 'మధ్యంతరం' ఆశ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా, చేయకున్నా కాంగ్రెసు పార్టీలో చీలిక అనివార్యమని భావిస్తున్నారు. కాంగ్రెసు తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకుంటుందని ఆయన నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ ను శాసనసభ్యులంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని ఆయన నమ్మడం లేదు. ఒక వేళ జగన్ ను ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్ఠాన వర్గం నామినేట్ చేస్తే తాత్కాలికంగా అంగీకరించినా కొంత మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం ఖాయమని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే వైయస్ వర్గీయులు అసమ్మతి సెగ రాజేసి ప్రభుత్వాన్ని కూల్చడం తప్పదని ఆయన అంటున్నారట.
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే శాసనసభ్యుల్లో కొంత మంది తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోనే వైయస్ వర్గీయులు ఇటీవల ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మద్దతు కోరారు. దీన్ని బట్టే వైయస్ వర్గీయుల్లో ఆత్మ విశ్వాసం లేకపోవడం గమనించవచ్చునని అంటున్నారు. జగన్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ శాసనసభలో మెజారిటీకి ఆ సంఖ్య సరిపోదు. అందుకే అస్థిరత్వంపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఈ స్థితిలో శాసనసభకు నాలుగున్నర ఏళ్ల లోపే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు తన మిత్రులతో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా రంగాన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు కూడా సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications