కెసిఆర్, బాబు కలిసికట్టుగానే..?

K Chandrasekhar Rao
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తృతీయ కూటమితోనే ఉంటానని పదే పదే స్ఫష్టం చేస్తున్నప్పటికీ వామపక్షాలకు నమ్మకం కుదురుతున్నట్లు లేదు. చంద్రబాబునాయుడిని తమవైపు లాగేందుకు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించిందనే వార్తలు వామపక్షాలకు మింగుడు పడడం లేదు. మొదటి నుంచి కూడా సిపిఐ, సిపిఎం నాయకులకు చంద్రబాబుపై అనుమానాలు ఉంటూనే వస్తున్నాయి. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబుతో కలవాల్సిన అనివార్యతలో ఆ పార్టీలు పడ్డాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ఓడించే ఏకైక లక్ష్యంతోనే మహా కూటమిని ఏర్పాటు చేశామని వామపక్షాలు చెప్పినప్పటికీ అంతకు మించిన రాజకీయ ప్రయోజనాన్ని చంద్రబాబునుంచి ఆశించాయి. అందుకు తగినట్లుగానే ఆయన వామపక్షాల నేతృత్వంలోని తృతీయ కూటమిలో చేరారు. అయితే, వామపక్షాలు గానీ, తృతీయ కూటమి గానీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరించినంత వరకే చంద్రబాబు ఉంటారు. వామపక్షాలు ఒక వేళ బిజెపిని అడ్డగించే లక్ష్యంతో కాంగ్రెసుతో చేతులు కలిపితే చంద్రబాబు తన దారి తాను వెతుక్కోక తప్పదు. అప్పుడు కాంగ్రెసును వ్యతిరేకించడానికి ఆయనకు కనిపించే మార్గం ఎన్డీయె తప్ప మరోటి కాదు.

చంద్రబాబును అమెరికా కాన్సులేట్ అధికారులు పీటర్ బర్లీ, స్టీవెన్ జె వైట్ కలుసుకోవడం కూడా వివాదాస్పంగా మారింది. పీటర్ బర్లీ భేటీతో వామపక్షాలు భయాలు మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి తెలుగుదేశం నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు ప్రయత్నించారు. పీటర్ బర్లీ చంద్రబాబు కలయికలకు రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తృతీయ కూటమి అధికారంలోకి వస్తే అణు ఒప్పందాన్ని సమీక్షిస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే పీటర్ బర్లీ మరో వైపు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కూడా కలుసుకున్నారు. ఫలితాలు వెలువడడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో పీటర్ బర్లీ భేటీలకు ప్రాధాన్యం చేకూరింది. పీటర్ బర్లీ బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని కూడా కలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలతో కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారే ప్రమాదం ఉండవచ్చునని వామపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అంటున్నారు. ఈ స్థితిలోనే చంద్రబాబు ఎన్డేయే వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్డీయేలోకి చంద్రబాబును కూడా తెస్తారా అని అడిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏమీ జవాబివ్వలేదు. అంటే ఏదో మతలబు ఉందనే భావన అని అంటున్నారు. ఎన్నికలకు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. చంద్రశేఖర రావు ఎన్డీయెతో కలిసి పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని రద్దు చేసి తెరాసలో చేరారని సమాచారం. చంద్రశేఖరరావు, చంద్రబాబు కలిసి రూపొందించుకున్న వ్యూహం ప్రకారమే నడుచుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+