మొయిలీతో భేటీకి మంత్రుల పోటీ
సురేఖ రాజీనామాను క్షణాల్లో ఆమోదించడంతో చాలా మంది కంగు తిన్నారని అంటున్నారు. ఈ వ్యవహారంతో జగన్ శిబిరంలో నిస్తేజం అలుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరింత నష్టాన్ని నివారించుకునేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. సురేఖ రాజీనామా విషయంలో చాలా మంది మంత్రులు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడారు. శనివారంనాడు వీరప్ప మొయిలీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, బాలినేని శ్రీనివాస రెడ్డి, పితాని సత్యనారాయణ, విశ్వరూప్ లాంటి చాలా మంది ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులంతా వైయస్సార్ విధేయులే. బాలినేని శ్రీనివాస రెడ్డి బంధువు కూడా. సురేఖ రాజీనామా వ్యవహారం జగన్ కు నష్టం కలిస్తుందనే అభిప్రాయం కూడా చాలా మందిలో చోటు చేసుకుంది. దీంతో జాగ్రత్త పడాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వీరప్ప మొయిలీతో మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఏర్పాటుపై చర్చించినట్లు చెబుతున్నారు. త్వరలోనే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తామని మొయిలీ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, జగన్ కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు కొందరు మంత్రులు పూనుకున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ రాజీనామా విషయంలో జగన్ ప్రోద్బలం లేదని కొందరు మంత్రులు మొయిలీకి చెప్పినట్లు సమాచారం. సురేఖ రాజీనామా విషయంలో జగన్ పాత్ర లేదని మొయిలీ అన్నప్పటికీ అధిష్టానం ఆలోచన మాత్రం మరో విధంగా ఉందని అనుకుంటున్నారు. దీంతో మంత్రులు అధిష్టానం మనసు మార్చే ఉద్దేశంతో ఆ మాటలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద, వీరప్ప మొయిలీ హైదరాబాద్ పర్యటన కాంగ్రెసు శాసనసభ్యులకు, మంత్రులక సవాల్ విసిరింది.