అల్లు పెత్తనం: 'చిరు' గోస

రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)తో సహా అన్ని స్థాయిల్లోని కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర తనను ఏ కమిటీలోకీ తీసుకోవద్దని స్వయంగా చిరంజీవికే చెప్పినట్లు తెలిసింది. పార్టీకి తన అవసరం ఏ రూపంలో ఉందని భావించినా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, కమిటీల్లో మాత్రం ఉండబోనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మాజీ ఎంపీ కెఎస్ ఆర్ మూర్తి సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. మరికొందరు సీనియర్ నేతలు సైతం ఇదే వైఖరితో ఉన్నారని పార్టీ వర్గాల కథనం. ఎన్నికల సమయంలో పీఏసీని పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థుల ఎంపికసహా ముఖ్యమైన నిర్ణయాలన్నీ జరిగాయన్న భావన పార్టీవర్గాల్లో ఉంది. దీనిపై కొందరు సీనియర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. కీలక సమయంలో తమను విస్మరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మిత్రా ఇప్పటికే చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది.
శివశంకర్, హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు కూడా నామమాత్రంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉండడాన్ని ఇష్టపడడం లేదని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీని సంప్రదించకుండానే ఎన్నికల్లో అన్ని నిర్ణయాలూ జరిగినప్పుడు దానిలో ఉండి కూడా ప్రయోజనం లేదనే భావనకు వారు గురైనట్లు చెబుతున్నారు. అల్లు అరవింద్ నిర్ణయమే తమ నిర్ణయంగా చెలామణి కావడాన్ని కూడా వారు జీర్థించుకోలేకపోతున్నారు. ఎన్నికలపై విశ్లేషణలు కూడా నామమాత్రంగానే జరిగాయని వారు భావిస్తున్నట్లు సమాచారం. వీరికి తోడు, సీనియర్ నేతలు టి. దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం కూడా తమ మార్గాలను వెతుక్కుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి ఎంతగా చెబుతున్నప్పటికీ ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలో చురుకైన పాత్ర పోషించే పరిస్థితిలేదని చెబుతున్నారు. దీనికంతటికీ కారణం అల్లు అరవిందేనని, అల్లు అరవింద్ నిర్ణయాలే ఆచరణలోకి వచ్చినప్పుడు కమిటీలు, నిర్ణయాలు వంటి వాటికి అర్థం లేదని వారు భావిస్తున్నట్లు సమాచారం.చిరంజీవి అల్లు అరవింద్ నిర్ణయాలకు తప్ప మరో అభిప్రాయానికి తావు ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications