గైర్హాజరీ జగన్ ధిక్కారమేనా?

అయితే, తనకు పార్టీ కన్నా, పార్టీ అధిష్టానం కన్నా ప్రజలే ముఖ్యమని వైయస్ జగన్ చెప్పడానికి, తన అనుచరులకు జరిగిన అవమానానికి తాను కినుక వహించానని చాటడానకి వైయస్ జగన్ ఎఐసిసి సదస్సుకు హాజరు కాలేదని చెబుతున్నారు. ఎఐసిసి సదస్సు జరిగిన మర్నాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులంతా క్యూ కట్టి సోనియా గాంధీని అభినందించారు. ఈ వ్యవహారంలో ఎక్కడా జగన్ లేరు. పది మందిలో ఒక్కడిగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని అంటారు. ఆయన వ్యక్తిత్వంలోనే అది ఉందని, తనకు ప్రత్యేక గౌరవం ఉండాలని ఆయన కోరుకుంటారు. తనను ప్రత్యేకంగా గుర్తించి అధిష్టానం తనకు పెద్ద పీట వేస్తే తప్ప ఆయన అంగీకరించరని అంటున్నారు. జగన్ గైర్హాజరీ ఎఐసిసి సదస్సు సందర్భంగా ఎక్కడా చర్చకు రాలేదు. ఆయన మానానికి ఆయనను వదిలేసినట్లే కనిపించారు.
వైయస్ జగన్ తీరును మాత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఎఐసిసి సదస్సు కూడా జగన్ కు ఓ అవకాశమని, దానికి వచ్చి ఉంటే మరో రకంగా ఉండేదని అంటున్నారు. జగన్ పార్టీలో ఒదుగుతారా, లేదా అనడానికి అది తెలియజేసింది. జగన్ పార్టీలో ఒదిగే పరిస్థితి లేదని ఇప్పటికే సోనియా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందువల్ల వైయస్ జగన్ ఎప్పటికప్పుడు పట్టించుకోనవసరం లేదని, గుర్తించినట్లు కూడా కనిపించకూడదని ఆమె అనుకుంటున్నారని సమాచారం. అయితే, జగన్ ఎఐసిసి సదస్సుకు రాకపోవడాన్ని ధిక్కారంగానే భావించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications