పులివెందులపై సీరియస్నెస్ కోసమే..

మొదటినుండి పులివెందులనుండి ఎమ్మెల్యేగా వైఎస్ వివేకాను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దివంగత వైఎస్ఆర్ సతీమణిని, జగన్ను తట్టుకోవాలంటే స్థానికంగా పట్టు ఉన్న వివేకానే సమర్థుడని భావిస్తోంది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆయననే నిలబెట్టాలని భావించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టి గెలిచాక కూడా మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టాలని భావించింది. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా గెలిస్తే ఉప ఎన్నికల్లో ఓటు వేసే వారు వివేకా లేక పోవడం వల్ల కాంగ్రెస్కు ఓటు వేయకుండా జగన్ పార్టీకి వేసే అవకాశాలు ఉన్నాయి. వివేకా గెలిచాడు కాబట్టి ఆయనకు వేయడం లాభం లేదనే ఉద్దేశ్యంలో వోటర్లు ఉండే అవకాశం ఉందని, అందుకే ఆయనను ఎమ్మెల్సీ ఎన్నికలనుండి తప్పించడమే సరియైన నిర్ణయంగా కాంగ్రెస్ భావించినట్టుగా తెలుస్తోంది.
కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వివేకా తప్పితే కాంగ్రెస్కు మరో మార్గం లేదు. ఇన్ని సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దానిని జగన్ వర్గం కూడా ఇంతకుముందు రెండుసార్లు కాంగ్రెస్ గెలుపు కాదని, వైఎస్ఆర్ గెలిపించినందునే అధికారంలోకి వచ్చిందనే గట్టి వ్యూహంతో ప్రజలలోకి వెళతారు. ఇవన్నీ తలనొప్పులకు బదులు గెలిచే అవకాశమున్న వివేకాను ఎమ్మెల్సీ నుండి తప్పించి ఉప ఎన్నికల పోరులోనే నిలబెట్టడం అత్యుత్తమంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications