సోనియా జన్మదినం లోపు సిఎం మార్పు?
పీఠంపై ఎవరిని కూర్చుండ బెట్టినా తమకు అభ్యంతరం లేదని ఆయితే మార్పు మాత్రం కావాల్సిందేనని చెప్పారట. కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కూడా సిఎంపై పలుమార్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. సిఎంపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వారి ఫిర్యాదుకు ఢిల్లీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే సోనియా జన్మదినం లోపు మార్పు ఉంటుందని అప్పటి వరకు వలసలు లేకుండా చూడాలని తెలంగాణ నేతలకు వారు సూచించారట. కాగా టిఆర్ఎస్లోకి మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జూపల్లి, సోమారపు, రాజయ్య టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
వీరే కాకుండా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా టిఆర్ఎస్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. వారు ఈ మేరకు టిఆర్ఎస్తో చర్చలు కూడా జరిపారట. పార్టీ మారేందుకు ఈ నెల 10న ముహూర్తం పెట్టుకున్నారని సమాచారం. ఈ నెల 6వ తేదినే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నప్పటికీ బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం అని చిదంబరం సోమవారం ప్రకటించడంతో వారు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు తప్ప తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని, దీని బదులు బయటకెళ్లడమే ఉత్తమమని మరికొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.