టీఆర్ఎస్, జగన్ కలిస్తే మనం మటాష్

పిసిసి మాజీ అధ్యక్షులు పి.నర్సారెడ్డి, సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని ఆజాద్కు పి.నర్పారెడ్డి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్తో జగన్ పొత్తు పెట్టుకొనే అవకాశముందని, ఇదే జరిగితే తెలంగాణాలో కాంగ్రెస్ వాష్ఆవుట్ అవుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మాత్రం జగన్ను తెలంగాణాలో కాలుమోపనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ఈ ప్రాంతంలో అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని పి.నరసారెడ్డి, పాల్వాయిగోవర్దన్రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో టిడిపి ఇప్పటికే జీరోగా ఉందని, ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడే అవకాశముందని ఆజాద్కు వారు తెలియజేశారు.
పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తనకు ఇప్పుడు ఏ పదవిపై ఆశలేదని, పార్టీ మనుగడ కోసమే తెలంగాణను కోరుతున్నానని ఆజాద్తో పి.నర్పారెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ ఇవ్వకపోతే మాత్రం ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరూ తిరగలేని పరిస్థితి అని త్వరగా ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆజాద్కు మంత్రులు కె.జానారెడ్డి, బి.సారయ్య, డి.శ్రీధర్బాబులు కోరారు. సమైక్యరాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకొన్న ఒప్పందాలు, హక్కుల తీర్మానాలు అని ఉల్లంఘనకు గురయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, ఇంద్రసేన్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, ప్రవీణ్రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కు తెలియజేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్కు చెందిన కొందరు కార్పోరేటర్లు తెలంగాణ అంశాన్ని తొందరగా తేల్చాలని కోరారు.












Click it and Unblock the Notifications