వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ చెల్లెమ్మలపై సాక్షి విసుర్లు
మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు వంటి వారు వైయస్పై నిత్యం అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని, అయితే ఆయన మంత్రివర్గంలో పని చేసి, ఆయన చెల్లెల్లుగా వారు మాత్రం మిన్నకుండిపోయారన్నది. అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన చెల్లెల్లు ఆ అన్నయ్యపై ఇప్పుడు ఆరోపిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డిని కూర్చోబెట్టిన ఘనత వైయస్ది అని, మహిళలకు మంత్రివర్గంలో మంచి పీట వేసిన ఘనత వైయస్ది అన్నారు. కాగా కేవలం ఒక మాజీ మంత్రి కొండా సురేఖ మాత్రమే వైయస్పై ఆరోపణలకు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత వైయస్ది అని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడ్డ వ్యక్తిపై బురద జల్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది.
సాక్షి వైయస్ జగన్ కొండా సురేఖ వైయస్ రాజశేఖర రెడ్డి sakshi ys jagan sabitha indra reddy konda surekha ys rajasekhar reddy
English summary
Ex MP YS Jagan's Sakshi news channel questioned women ministers for their silence on allegations made against former Chief Minister YS Rajasekhar Reddy. DL Ravindra Reddy and Shankar Rao and others are questioning scams took place in YSR regime.
Story first published: Tuesday, February 15, 2011, 11:11 [IST]