యాత్ర: బాబు లేని సమయంలో 5గురు

Chandrababu Naidu
రేపటి నుండి(అక్టోబర్ 2) నుండి 117 రోజులు పాదయాత్ర తలపెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన గైర్హాజరీలో పార్టీ కేంద్రంగా నెరపాల్సిన బాధ్యతలను ఐదుగురితో కూడిన ఓ బృందానికి అప్పగించారు. బాబు తాను లేని సమయంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, రోజు వారి కార్యకలాపాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, దాడి వీరభద్రరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. రాజకీయ, జిల్లాల వ్యవహారాలు యనమలకు, పార్లమెంటరీ విభాగం, జిల్లా ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం దేవేందర్‌కు, అనుబంధ సంఘాల బాధ్యత పెద్దిరెడ్డికి, మానవ వనరుల విభాగం బాధ్యతలు దాడి వీరభద్రరావుకు, మీడియా సమావేశాల బాధ్యత రావులకు అప్పగించారు.

పాదయాత్ర బాధ్యతలను మరికొందరు నేతలకు అప్పగించారు. పాదయాత్ర మార్గం ఖరారు, పార్టీ నేతలతో సమన్వయం బాధ్యత మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన రావుకు అప్పగించారు. యాత్ర మార్గం పొడవునా ముందస్తుగా పార్టీ నేతలను సన్నద్ధం చేయడం, ఇతర అంశాల పర్యవేక్షణను రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జనార్దన రావుకు అప్పగించారు. యాత్రలో చంద్రబాబు వెంట ఉండి సమన్వయం చేసుకొనే పనిని ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావుకు ఇచ్చారు.

ఇక, చంద్రబాబు లేని సమయంలో పార్టీ కార్యక్రమాల తీరును పార్టీ కార్యక్రమాల కమిటీ పర్యవేక్షిస్తుంది. గతంలో మీ కోసం యాత్ర సమయంలో కూడా చంద్రబాబు మూడు నెలలు రాజధానిలో అందుబాటులో లేరని, అప్పుడు పార్టీ నేతలకు కొంత అనుభవం వచ్చిందని, అది ఇప్పుడు ఉపయోగపడుతుందని నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+