ఆజాద్ ఎదుట దామోదర టార్గెట్ మళ్లీ సిఎంపైనే?
హోం శాఖ కోసం దామోదర రాజనర్సింహ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు. హోం శాఖ నుంచి సబితా ఇంద్రా రెడ్డి నుంచి తప్పించి దామోదర రాజనర్సింహకు అప్పగించేలా చేయడానికే శంకరరావు, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ కలిసి వ్యూహరచన చేసి అమలు చేసినట్లు చెబుతారు. హోం సబితా ఇంద్రా రెడ్డిని టార్గెట్ చేయడం ఇందులో భాగమేనని అంటారు. ఆ వ్యూహం ఫలించకపోగా, శంకరరావు మంత్రి పదవికే ఎసరు వచ్చింది. దీంతో శంకరరావును వెనకేసుకు రావాల్సిన అవసరం దామోదర రాజనర్సింహకు ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో సమన్వయ కమిటీ సమావేశంలో దామోదర రాజనర్సింహ ఆ వ్యవహారంపై తీవ్ర రగడ చేయడానికే సిద్ధపడినట్లు చెబుతున్నారు.
దళితులకు అన్యాయం జరుగుతోందనే వాదనతో దామోదర రాజనర్సింహ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వివాదాన్ని గులాం నబీ ఆజాద్ ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరస్పరం ఆధిపత్యం కోసం పోరాడుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకరరావు విషయంలో మాత్రం ఒక్కటయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం కాంగ్రెసులో ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.