దుమ్మురేపుతున్న బాలకృష్ణ
అభిమానులు బాలయ్య సిఎం అవుతారని భావిస్తుంటే, టిడిపి క్యాడర్ బాలయ్య రాక ద్వారా పార్టీ బలం బాగా పుంజుకుంటుందనే కోటి ఆశలతో ఉన్నారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న బాలయ్య టిడిపి క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఆదివారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. పలువురు నేతలైతే బాలయ్య వస్తామంటే తమ స్థానం వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక కార్యకర్తల ఉత్సాహం అంతా ఇంతా కాదు. బాలయ్య పార్టీకి పునర్వైభవం తీసుకు వస్తారని వారి గట్టిగా నమ్ముతున్నారు. తన తనయుడు మోక్షజ్ఞను సినీ వారసుడిగా ప్రకటించడం ద్వారా, పార్టీ ఆదేశిస్తే తెలంగాణ నుండి పోటీ చేసేందుకు సిద్ధం అని చెప్పడం ద్వారా రాజకీయాల్లోకి రాకముందే స్పీడ్ చూపిస్తున్న బాలయ్య వస్తే ఇక ఎంత స్పీడ్ చూపిస్తారో అని అభిమానులు మురిసి పోతున్నారు. అయితే అంత జోష్లోను ఆయన తెలంగాణ వంటి సున్నిత అంశం, పదవిపై ఆచితూచి మాట్లాడుతున్నారు.