వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై చంద్రబాబు వైఖరి మారుతోందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి మారుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ అంశం పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసే విషయంపై బాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జోరుగా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఆయన వైఖరి మారుతోందని టి-టిడిపి నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. గురువారం టి-టిడిపి నేతలతో బాబు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై చర్చ జరిపారు. శుక్రవారం ఇదే అంశంపై మరోసారి భేటీ అవుతున్నారు. గురువారం బాబుతో భేటీ అయిన అనంతరం టి-టిడిపి నేతలు మాట్లాడుతూ.. బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసే విషయాన్ని ఆలోచిస్తున్నారని చెప్పారు. గురువారం జరిగిన భేటీలో బాబు నేతలతో తెలంగాణపై ఏం చేస్తే బాగుంటుందని ప్రశ్నించారని తెలుస్తోంది.

తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖను మరోసారి ఇవ్వాలని పార్టీ నేతలు సూచించారట. అలా ఇస్తే పార్టీ తెలంగాణలు మళ్లీ పుంజుకుంటోందని వారు బాబు దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ ప్రజలు పార్టీని ఆదరించలేదని, ఈ అంశంపై ఒక స్పష్టమైన వైఖరి మనం చెప్పకుంటే పార్టీ మరింత దిగజారుతోందని వారు బాబుకు సూచించినట్లుగా సమాచారం. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. తెలంగాణ బాధ్యత టిడిపి పైన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. పార్టీ తెలంగాణ ప్రాంతంలో మళ్లీ పుంజుకోవాలంటే గతంలో ఇచ్చిన లేఖనే మరోసారి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారట. అయితే ఆ లేఖలో ఏం మార్పులు చేయాలనే అంశంపై ఆయన ఇరు ప్రాంతాల పార్టీల నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.

లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించిన మీదట కేంద్రానికి దానిని పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేఖలో తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేలా చూస్తున్నారట. చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యల పైన కూడా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా తెలంగాణ బాగా హీటెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టమైన వైఖరితో లేఖ రాయాలని టి-టిడిపి నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా సూచిస్తున్నారట. అలా అయితేనే రాష్ట్రంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారట. ఈ కారణంగానే తెలంగాణపై క్రమంగా బాబు వైఖరి మారినట్లుగా కనిపిస్తోంది.

English summary
It seems, TDP chief Nara Chandrababu Naidu attitude is changing on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X