ఎర్రన్నాయుడి లోటును భర్తీ చేసేదెవరు?

నోటిమాటతో జిల్లా పార్టీ శ్రేణుల్ని సమన్వయపరిచే ఎర్రన్న మృతి టిడిపికి తీరని లేటే. కొంతలో కొంత అయినా ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే వారిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎర్రన్నాయుడు స్థానాన్ని ఆయన సతీమణి విజయ లేదా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడుతో భర్తీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. రాజకీయాల్లోకి కొడుకులు, కూతుళ్లు రావడం సాధారణమై పోయింది.
అయితే ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాలపై ఆసక్తితో తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చి, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెడతారా అనేది చూడాలి. రామ్మోహన్ నాయుడుకి కాకున్నా ఆయన సతీమణి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్న వెంట నడిచిన తెలుగు తమ్ముళ్లను నడిపిస్తారా అనే చర్చ సాగుతోంది.
అయితే ఎవరు వచ్చినా జిల్లాలో తన క్యాడర్కు మాత్రమే న్యాయం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఎర్రన్నాయుడు పోషించిన పాత్రను పోషించడం మాత్రం ఎవరి వల్ల అయ్యే పని కాదు. జిల్లాలో ఎర్రన్నాయుడు లేని కొరతను తనయుడు, భార్యనో లేక మరో నేత ఎవరు కొంతలో కొంత తీర్చనా.. పార్టీలో మాత్రం ఆయన లేని లోటును పూడ్చలేదనిదే అని అంటున్నారు.












Click it and Unblock the Notifications