ఎంఐఎం ఎంట్రీ: జగన్కు ఝలకా, కాంగ్రెస్కు షాకా?

రాయచోటిలో ఆయన జగన్, కాంగ్రెసు, టిడిపిలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. సీమలో ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని స్థాపించడంతో ఇన్నాళ్లూ అక్కడి మైనార్టీ ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్న పార్టీలకు ఆందోళన పట్టుకుంది. ఎంఐఎం కనుక బరిలోకి దిగితే గుంపగుత్తగా ఆ ఓట్లన్నీ ఆదే పార్టీకి పడతాయి. దీంతో తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని అవి భావిస్తున్నాయి. రాయలసీమలో ఇప్పటి వరకు ముస్లిం వర్గాలు కాంగ్రెసు పార్టీని ఆదరిస్తూ వచ్చాయని చెప్పవచ్చు. ఇటీవల జగన్ కాంగ్రెసును వీడి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో ఆయనకూ మద్దతిస్తున్న వారు ఉన్నారు. అయితే ఎంఐఎం అక్కడ ఆరంగేట్రం చేయడంతో, ముస్లింల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలలో గుబులు పట్టుకుందని అంటున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనున్నాయనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంట్రీ జగన్కు ఝలక్ ఇస్తుందా లేక కాంగ్రెస్కు షాక్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications