కెసిఆర్ కూతురు కవితకు లైన్ క్లియర్!

శనివారం జరిగిన తెరాస ఆవిర్భావ సభ వేదికపై పార్టీ కల్వకుంట్లర కవిత కూర్చోవడం చర్చనీయాంశమైంది. గతంలో తెరాస వేదికలపై ఎప్పుడూ కవిత కనిపించలేదు. ఆవిర్భావ సభ వేదికపై కూర్చోవడం ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎంపి అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న కవిత, జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఆమె పోటీ చేసే విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా ప్రకటించకపోయినా వేదికపై ఆమె కూర్చోవడంతో పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆవిర్భావ సభలో ఎంపి అభ్యర్ధిగా కవిత పేరు ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. కవిత మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ కావడంతో ఆమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ నుండి కాంగ్రెసు పార్టీ ఎంపీ మధుయాష్కీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మరోవైపు పార్టీ ఆవిర్భావ సభ అనంతరం కెసిఆర్ తన ఫాంహౌస్కు చేరుకున్నారు. కెసిఆర్ ఫాం హౌస్లో ఉండటం నిత్యం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆయన తెరాస ప్రతినిధుల సమావేశం, 13వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఫాం హౌస్కు వెళ్లిపోయారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications