నరేంద్ర మోడీ ఏడాది పాలన: 10కి 7 మార్కులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పని తీరుకు అసోచాం పది మార్కులకు గాను ఏడు మార్కులు ఇచ్చింది. అయితే, ఇప్పటికీ కొన్నింటిని ఫుల్ ఫిల్ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. భారత దేశం యొక్క స్థూల ఆర్థిక పరిస్థితి ఈ ఏడాదిలో కొంత మెరుగైందని తెలిపింది.
ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టడం, కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి జరిగాయి. కొన్ని పన్నుల విషయంలో ఎన్డీయే ప్రభుత్వం పునాది నుండి కవర్ చేయాల్సి ఉంది. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అసోచామ్ అభిప్రాయపడింది.
ప్రభుత్వం మారగానే ఒక్కసారిగా పెనుమార్పు రాదని పేర్కొంది. చట్టాల మార్పులు, పాలసీలు.. ఇలా పలు అంశాల్లో మార్పుల కోసం 24 నుండి 30 నెలల వరకు సమయం తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం బాగానే ఉన్నప్పటికీ.. మరికొంత వేగం కావాల్సి ఉందని తెలిపింది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గత ఏడాది (2014)లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీచింది. బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఏకంగా 330కి పైగా సీట్లువచ్చాయి. బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సీట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి మిత్రపక్షాలను తీసుకుంది.