హోంపేజి
రజనీకాంత్ తాజా చిత్రం శివాజీ తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ సినిమా ఫైనాన్షియర్ తిరుపతి ప్రసాద్ కళ్ళు తిరిగే విధంగా పదికోట్లకు కొనుగోలు చేయడంతో, తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల్లో గుబులు ఎక్కువైంది. అదే సోమవారం నుంచి డబ్బింగ్ సినిమాల నిషేధానికి దారి తీసినట్టు తెలుస్తోంది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు నిర్మాతల వత్తిడి మేరకు డబ్బింగ్ సినిమాలపి నిషేధం విధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు అగ్ర నిర్మాతలతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్బాబు వంటి అగ్ర హీరోలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంచి ఎక్కడునా మెచ్చుకోవాలని, తమిళ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగా ఆడుతున్నాయంటే వాటి మెరిటే కారణమని, గజిని, అపరిచితుడు, చంద్రముఖి వంటి సినిమాలను తాను ఇంట్లో ్లకుటుంబసభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేశానని చిరంజీవి ఇటీవలే చెప్పారు. డబ్బింగ్ సినిమాలు చిన్న నిర్మాతలకు కకనవర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా వీటి ద్వారా అధికంగా పన్ను ఆదాయం లభిస్తోంది. క్రిష్, అపరిచితుడు, పందెంకోడి, ప్రేమిస్తే, చంద్రముఖి, గజిని. మన్మధ, ధీరుడు, ప్రేమపావురాలు, దెయ్యాలకోట, హారీపాటర్, గజబలుడు, స్పైడర్మ్యాన్-2, టెర్మినేటర్-3, టైటానిక్ వంటి డబ్బింగ్ సినిమాలు ఒక థియేటర్లోనే వందరోజులు ఆడిన సందర్భాలున్నాయి.
మోహన్బాబు
రాజకీయ
సందిగ్ధం
నయనతార
ఖరీదైన
చర్మ
చికిత్స