ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రంలో ఇంకా సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. నిన్న ఒక టీవీ ఛానల్లో గంటన్నర సేపు కన్పించిన ఆయన చాలా లౌక్యంగా మాట్లాడారు. మార్గదర్శి హైనాన్సియర్స్లో తన కుటుంబ సభ్యులకు డిపాజిట్లు ఉన్నాయని, మిగితా డిపాజిటర్లకు న్యాయం చేసిన తర్వాతే తాను వాటిని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ద్వారా ఆయన తెలివిగా వ్యవహరించినట్టు పైకి కనిపిస్తోంది. ఆయన రామోజీరావు వంటి ఒక పెద్ద మనిషి మీద, ఒక పెద్ద మీడియా గ్రూపు మీద దాడి చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు ఎక్కువ మంది జనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడం రామోజీరావు నెత్తిమీద పాలు పోసినట్టు కనిపిస్తోంది. ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అతి వేగంగా ప్రతిస్పందించి ఉండేది. అలాగే డిపాజిటర్లలో పెద్దగా ఆందోళన క న్పించకపోవడం నిజంగా రామోజీరావు అదృష్టమే. డిపాజిటర్ల క్షేమమే తనకు ముఖ్యమని అందువల్లనే తాను ఇంకా తదుపరి చర్యలు కోరడం లేదని ఉండవల్లి చెప్పడంలో ఎంత నిజం ఉందో కొన్ని రోజుల తర్వాత కానీ తెలియదు. మొత్తానికి మార్గదర్శి ఉదంతం వల్ల అతి ముఖ్యమైన కరీంనగర్ ఉప ఎన్నిక విషయం ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు ఫిల్మ్ సిటీ మీద దాడి చేసిన చంద్రశేఖరరావు ఈనాడు రామోజీరావుకు అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ లోనూ ఆంధ్రలోనూ చర్చనీయాంశమైంది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications