'ఇంద్ర' తర్వాత 'సమరసింహారెడ్డి'

వీలు చూసుకుని డిసెంబరు నుంచి ఎన్నికల వరకు పార్టీకోసం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని సమాచారం. రాయలసీమలో బాలకృష్ణ రోడ్షోలు పార్టీకి మరింత ఊపునిస్తాయని తెదేపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు 'మీకోసం' యాత్రకు ఉపయోగించిన పసుపురంగు వాహనాన్నే బాలకృష్ణ ఈ యాత్రకు ఉపయోగించనున్నారని సమాచారం. బాలయ్య మలేషియా వెళ్లేముందు ఈ రథాన్ని ఎక్కి ఎలా ఉంది, అందులోంచి ప్రజలందరికీ కనబడతామా లేదా అనేది పరిశీలించారని, కొన్ని మార్పులు కూడా సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ వాహనం కాకుండా కొత్తగా మరో వాహనాన్ని సిద్ధం చేసే ఆలోచన కూడా ఉందని ఆ వర్గాలు వివరించాయి.












Click it and Unblock the Notifications