వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు 'జ్యోతి'కి ఏం చేయలేదా?

By Staff
|
Google Oneindia TeluguNews

Radhakrishna
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా తనకేం చేయలేదని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ ఆత్మకథ ఆయన సొంత పత్రికలో గత మూడు రోజులుగా సీరియల్ గా వచ్చింది. తాను మహారాష్ట్ర నుంచి కిరోసిన్ ను ఎలా స్మగుల చేసిందీ ఆయన గొప్పగా రాసుకున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు బియ్యాన్ని ఎలా స్మగుల్ చేసిందీ రాసుకున్నారు. ఒక యోగి ఆత్మకథ కంటే చాలా గొప్ప జీవితమది. పరమహంస యోగానంద బతికి ఉంటే తాను కూడా ఈ విధంగా రాసుకుంటే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చి ఉండే వాడేమో. తాను ఆంధ్రజ్యోతి పునరుద్ధరణ కోసం ఒక పైరవీ చేయాలనుకుంటే అందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదని ఆయనకు పరోక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మకథ సారాంశమేమిటి?

కాంగ్రెస్ వాళ్ళకు మోకాళ్ళలో మెదడు ఉంటుందన్న విషయం ఇక్కడ బయట పడింది. తాను స్మగ్లింగ్ చేసి పైకి వచ్చానని ఒక పత్రిక యజమాని తన పత్రికలో ప్రకటించుకున్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒక చర్య తీసుకోవచ్చు కదా? అలా తీసుకోలేదంటే అంతకంటే పెద్ద తప్పులు చేశామని అధికారపార్టీ ఒప్పుకున్నట్టే కదా! రాధాకృష్ణ విజయగాధ గొప్పదే. ఆయన జర్నలిస్టుల కోసమే, వారి అభివృద్ధి కోసమే ఇంత సాహసం చేశారు. మరి ఆయన కంటే ఎక్కువ జీతాలిస్తూ సాక్షిని నడుపుతున్న జగన్ జర్నలిస్టులకు ఇంకా ఎక్కువ చేసినట్టా కాదా? మరి జ్యోతి నుంచి సాక్షి లోనూ, ఐ వెంకట్రావు చానల్ లోను చేరిన జర్నలిస్టుల మాటేమిటి? వారు రాధాకృష్ణ చిన్న స్ధాయి స్మగ్లింగ్ గురించి ఏమనుకుంటున్నారో?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X